ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. పట్టాలెక్కనున్న మరిన్ని రైళ్లు..
ప్రయాణీకులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ అందించింది. త్వరలోనే దసరా, దీపావళి పండగ సీజన్ షురూ కానుండటంతో.. జోన్ల వారీగా కొత్తగా 39 రైళ్లు నడిపేందుకు రైల్వేశాఖ ఆమోదముద్ర వేసింది.
Railway Board Approves New Trains: ప్రయాణీకులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ అందించింది. త్వరలోనే దసరా, దీపావళి పండగ సీజన్ షురూ కానుండటంతో.. జోన్ల వారీగా కొత్తగా 39 రైళ్లు నడిపేందుకు రైల్వేశాఖ ఆమోదముద్ర వేసింది. సాధ్యమైనంత త్వరగా ఈ రైళ్లను నడపనుంది. అంతేకాకుండా ఆయా రైల్వే జోన్ల నుంచి వచ్చిన ప్రతిపాదనల మేరకు పండగ సీజన్లో ఈ ట్రైన్స్ నడిపేందుకు రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దక్షిణ మధ్య రైల్వే(ఎస్సీఆర్)కు కేవలం మూడు రైల్ సర్వీసులను మాత్రమే ఆమోదించింది. కాగా, ఈ రైళ్లు ప్రారంభమయ్యే తేదీ, టికెట్ల బుకింగ్ వివరాలకు సంబంధించిన తేదీలను త్వరలోనే రైల్వేశాఖ ప్రకటించనుంది.
Railway Board today gave approval to zones for 39 new trains. These services will be introduced as special services from an early convenient date: Ministry of Railways, Government of India pic.twitter.com/UloAYzxZBS
— ANI (@ANI) October 7, 2020