తెలంగాణ ముద్దు బిడ్డ జైపాల్ రెడ్డి : రాహుల్
కేంద్ర మాజీ మంత్రి జైపాల్రెడ్డి ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. గత కొన్నిరోజులుగా నిమోనియా వ్యాధితో బాధపడుతున్న ఆయన గచ్చిబౌలిలోని ఏషియన్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ సందర్భంగా జైపాల్తో తమకున్న అనుబంధాన్ని తలుచుకుని రాజకీయ నేతలు తీవ్ర భావోద్వేగానికి లోనవుతున్నారు. జైపాల్ మృతిపట్ల రాహుల్ గాంధీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ముద్దు బిడ్డ జైపాల్ రెడ్డి అంటూ కొనియాడారు. ఆయన ఓ గొప్ప పార్లమెంటేరియన్ అని.. […]
కేంద్ర మాజీ మంత్రి జైపాల్రెడ్డి ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. గత కొన్నిరోజులుగా నిమోనియా వ్యాధితో బాధపడుతున్న ఆయన గచ్చిబౌలిలోని ఏషియన్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ సందర్భంగా జైపాల్తో తమకున్న అనుబంధాన్ని తలుచుకుని రాజకీయ నేతలు తీవ్ర భావోద్వేగానికి లోనవుతున్నారు.
జైపాల్ మృతిపట్ల రాహుల్ గాంధీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ముద్దు బిడ్డ జైపాల్ రెడ్డి అంటూ కొనియాడారు. ఆయన ఓ గొప్ప పార్లమెంటేరియన్ అని.. తన యావత్ జీవితాన్ని ప్రజాసేవకే అంకితం చేశారన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ట్వీట్ చేశారు.
I’m sorry to hear about the sad demise of former Union Minister & veteran Congress leader Shri Jaipal Reddy Garu. An outstanding parliamentarian, great son of Telangana, he dedicated his entire life towards public service. My deepest condolences to his family & friends.
— Rahul Gandhi (@RahulGandhi) July 28, 2019