కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే వివేకానంద్‌గౌడ్‌కు కరోనా పాజిటివ్‌..

|

Jul 20, 2020 | 9:16 AM

తెలంగాణలో కరోనా వీర‌విహారం చేస్తోంది. కేసుల సంఖ్య రోజురోజుకు ప్ర‌మాద‌క‌రంగా మారుతోంది. సామాన్య ప్ర‌జ‌లు మాత్ర‌మే కాదు..అధిక సంఖ్య‌లో ప్ర‌జాప్ర‌తినిధులు సైతం క‌రోనా బారిన ప‌డుతున్నారు.

కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే వివేకానంద్‌గౌడ్‌కు కరోనా పాజిటివ్‌..
Follow us on

తెలంగాణలో కరోనా వీర‌విహారం చేస్తోంది. కేసుల సంఖ్య రోజురోజుకు ప్ర‌మాద‌క‌రంగా మారుతోంది. సామాన్య ప్ర‌జ‌లు మాత్ర‌మే కాదు..అధిక సంఖ్య‌లో ప్ర‌జాప్ర‌తినిధులు సైతం క‌రోనా బారిన ప‌డుతున్నారు. ఇప్పటికే పలువురు శాస‌న‌స‌భ్య‌లుకు కోవిడ్-19 సోకగా.. తాజాగా కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే వివేకానంద్‌గౌడ్‌కు కరోనా బారిన‌ప‌డ్డారు. ఆయన స‌తీమ‌ణి సౌజన్య, కుమారుడు విధాత్‌లకు సైతం కోవిడ్ పాజిటివ్ గా నిర్దార‌ణ అయిన‌ట్లు ఆదివారం డాక్ట‌ర్లు వెల్లడించారు. దీంతో ఎమ్మెల్యే ఫ్యామిలీ మెంబ‌ర్స్ తమ ఇంట్లోనే వేర్వేరు గదుల్లో హోం క్వారంటైన్‌లో ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఆయ‌నతో స‌న్నిహితంగా మెలిగిన‌వారికి టెస్టులు చేయ‌నున్నారు అధికారులు.

ఇక ఆదివారం విడుద‌ల చేసిన బులిటెన్ ప్ర‌కారం తెలంగాణ‌లో కొత్తగా 1,296 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్యశాఖ వెల్ల‌డించింది. దీనితో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 45,076కి చేరింది. ఇందులో 12,224 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మొత్తంగా 32,438 మంది ఇప్పటివరకు వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 415కి చేరింది.