నాగార్జున సాగర్ వద్ద పీవీ సింధు సందడి
భారత స్టార్ షట్లర్ పీవీ సింధు నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద సరాదాగా గడిపారు. ప్రాజెక్ట్ వద్ద జల కళ బాగుండటంతో ఆమె తమ ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి సాగర్ చేరుకున్నారు.
భారత స్టార్ షట్లర్ పీవీ సింధు నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద సరాదాగా గడిపారు. ప్రాజెక్ట్ వద్ద జల కళ బాగుండటంతో ఆమె తమ ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి సాగర్ చేరుకున్నారు. ప్రాజెక్ట్ వద్ద ఆమె చాలా సేపు ఉల్లాసంగా గడిపారు. ఇక సింధు ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. అక్కడ ఆమెతో ఫోటోలు దిగేందుకు పర్యాటకులు ఆసక్తి చూపించారు.
ఇక నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతున్నది. మొత్తం 20 క్రస్టుగేట్ల నుంచి నీటిని రిలీజ్ చేస్తున్నారు. 10 గేట్లు 15 అడుగుల మేర, 10 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక ప్రాజెక్ట్ కు ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో రెండూ 4,10,978 క్యూసెక్కులు ఉంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి నిల్వ : 312.0450 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ : 312.0450 టీఎంసీలు. పూర్తిస్థాయి నీటిమట్టం : 590 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం : 590.00 అడుగులు ఉంది.
Also Read :