అక్కడ పది రోజుల పాటు లాక్డౌన్.. మందుబాబుల హల్చల్..
దేశంలో కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో మహారాష్ట్రలోని పుణెలో జూలై 13 నుంచి 23 వరకూ లాక్డౌన్ విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రకటన వెలువడిన
దేశంలో కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో మహారాష్ట్రలోని పుణెలో జూలై 13 నుంచి 23 వరకూ లాక్డౌన్ విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రకటన వెలువడిన గంటల వ్యవధిలోనే మందుబాబులు మద్యం దుకాణాల ముందు బారులు తీరారు. పది రోజుల వరకూ మళ్లీ మద్యం దుకాణాలు తెరిచే అవకాశం లేకపోవడంతో స్టాక్ పెట్టుకోవాలని మద్యం ప్రియులు నిర్ణయించుకున్నారు.
కరోనా కట్టడికోసం ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపడుతున్నా.. రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో ముంబై తర్వాత పుణె జిల్లాలోనే కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. పుణె జిల్లాలో గురువారం ఒక్కరోజే 1,803 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. వీటిలో 1,032 కరోనా కేసులు ఒక్క పుణె నగరంలోనే నమోదయిన పరిస్థితి. ఇప్పటివరకూ 978 మంది కరోనా వల్ల మరణించారు. పుణెలో పది రోజుల పాటు లాక్డౌన్ విధించిన మహారాష్ట్ర ప్రభుత్వం.. కేవలం అత్యవసరాలకు మాత్రమే అనుమతినిచ్చింది.
[svt-event date=”11/07/2020,12:04AM” class=”svt-cd-green” ]
Maharashtra: People gather outside liquor shops in Pune, following the announcement of lockdown in the city from July 13 to 23, in view of #COVID19. pic.twitter.com/WKlF7pRFqE
— ANI (@ANI) July 10, 2020
[/svt-event]