నేడు పీఎస్ఎల్వీ సీ 50 ప్రయోగం.. సరికొత్త కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని ఇస్రో నింగిలోకి పంపనున్న ఇస్రో
నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ రెండో ప్రయోగ వేదిక నుంచి పీఎస్ఎల్వీ సీ 50 ప్రయోగం చేపట్టనున్నారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన అస్రో శాస్త్రవేత్తలు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లేందుకు సిద్దం చేశారు.
నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ రెండో ప్రయోగ వేదిక నుంచి పీఎస్ఎల్వీ సీ 50 ప్రయోగం చేపట్టనున్నారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన అస్రో శాస్త్రవేత్తలు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లేందుకు సిద్దం చేశారు.కాగా, కమ్యూనికేషన్ శాటిలైట్ సీఎంఎస్-01ను నింగిలోకి పంపనున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. అత్యాధునిక సాంకేతిక సమాచారాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ఇస్రో సాగించే నిరంతర ప్రక్రియ మరింత వేగవంతమైంది. షార్లోని రెండో ప్రయోగవేదిక నుంచి గురువారం మధ్యాహ్నం 3:41 గంటలకు పీఎస్ఎల్వీ – సీ50 ఉపగ్రహ వాహకనౌకను ప్రయోగించనున్నారు. అయితే మంగళవారం మధ్యాహ్నం 2:41 గంటలకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది.
1,410 బరువులో నింగిలోకి.. 1,410 కిలోల బరువు కలిగిన సీఎంఎస్–01 (జీశాట్–12ఆర్) అనే సరికొత్త కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని ఇస్రో నింగిలోకి పంపనున్నారు. పీఎస్ఎల్వీ సీ-50 ఎక్స్ఎల్ సిరీస్లో ఇది 22వది అని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. అంతేకాకుండా షార్ నుంచి ఇది 77వ మిషన్ అని వెల్లడించింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన సీఎంఎస్01(జీ సాట్14ఆర్) ఉపగ్రహాన్ని నింగిలోకి పంపనున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు.