పటాన్చెరు మండలంలో కలకలం..శాంపిల్ క్షిపణి మిస్ ఫైర్.. భయాందోళనకు గురైన స్థానికులు..
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం భానూరులోని బీడీఎల్ పరిశ్రమలో తయారు చేసిన ఓ శాంపిల్ క్షిపణి మిస్ ఫైర్ అయ్యింది. ఆ క్షిపణి వేగానికి సంబంధించి టెస్టులు చేస్తుండగా ...
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం భానూరులోని బీడీఎల్ పరిశ్రమలో తయారు చేసిన ఓ శాంపిల్ క్షిపణి మిస్ ఫైర్ అయ్యింది. ఆ క్షిపణి వేగానికి సంబంధించి టెస్టులు చేస్తుండగా …పరిశ్రమ గోడపై నుంచి ఒక్కసారిగా దూసుకెళ్లింది. దాదాపు 3 కిలోమీటర్ల దూరంలోని ఓ వ్యవయసాయ పొలంలో పడి… కొంతమేర భూమిలోకి చొచ్చుకుపోయింది. ఓ గ్రామస్థుడు ఇచ్చిన సమాచారం మేరకు సీఐఎస్ఎఫ్ అధికారులు క్షిపణిని స్వాధీనం చేసుకున్నారు.
మిస్ఫైర్ అయిన సమయంలో పెద్ద శబ్దం రాగా… చుట్టు పక్కల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వేగ సామర్థ్యానికి సంబంధించి రీడింగ్ లెక్కిస్తుండగా… రెండు తీగలు ఒకదానికొకటి తాకి మిస్ఫైర్ అయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించినట్లు సమాచారం. విజిలెన్స్ అధికారులతో ఓ స్పెషల్ కమిటి వేశారని తెలుస్తోంది. ఇప్పటికే ప్రత్యక్షంగా ఉన్న ముగ్గురు ఉద్యోగులతో పాటు మరో 15 మందిని అంతర్గతంగా విచారిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
Also Read :
స్టార్ హీరోలు కూడా చేయలేని రిస్క్ చేస్తోన్న కియారా, మరి అమ్మడు అదరగొడుతుందా..?
రూటు మార్చిన టాలీవుడ్ ముద్దుగుమ్మలు..వారు అలా..వీరు ఇ
ఏపీలో 53 మంది మహిళా జీవిత ఖైదీల విడుదలకు ఉత్తర్వులు, అలా చేస్తే ఆర్డర్స్ రద్దు