నిలోఫర్ లో నీచపు పని… బాధితుల సంఖ్య వింటే షాక్ !!

నిలోఫర్ క్లినికల్ ట్రయల్స్ కేసులో మరో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. గతేడాది నుంచి ఇప్పటివరకు మొత్తం 300 మంది పిల్లలపై క్లినికల్ ట్రయల్స్ జరిగినట్లు సమాచారం. అప్పుడే పుట్టిన శిశువులు మొదలు 14 ఏళ్లలోపు పిల్లలపైనే ఈ ప్రయోగాలు జరిగినట్లు క్లినికల్ ట్రయల్స్ రిజిస్ట్రీ ఇండియా నివేదికలో వెల్లడించింది. అయితే ఈ 300 మందిలో జనరల్ వార్డు నుంచి 100 మందిని, పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ నుంచి 100 మందిని, నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ […]

నిలోఫర్ లో నీచపు పని... బాధితుల సంఖ్య వింటే షాక్ !!
Follow us

| Edited By:

Updated on: Sep 29, 2019 | 9:57 AM

నిలోఫర్ క్లినికల్ ట్రయల్స్ కేసులో మరో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. గతేడాది నుంచి ఇప్పటివరకు మొత్తం 300 మంది పిల్లలపై క్లినికల్ ట్రయల్స్ జరిగినట్లు సమాచారం. అప్పుడే పుట్టిన శిశువులు మొదలు 14 ఏళ్లలోపు పిల్లలపైనే ఈ ప్రయోగాలు జరిగినట్లు క్లినికల్ ట్రయల్స్ రిజిస్ట్రీ ఇండియా నివేదికలో వెల్లడించింది. అయితే ఈ 300 మందిలో జనరల్ వార్డు నుంచి 100 మందిని, పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ నుంచి 100 మందిని, నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ నుంచి మరో 100 మందిని ఎంపిక చేశారు. వీరిపై యాంటీ బయోటిక్స్‌ మందుల ప్రయోగం జరిగిందని నివేదిక తెలిపింది. పిల్లలు రోగాలతో ఆసుపత్రిలో ఉన్నప్పుడు వారిపై యాంటీ బయోటిక్స్‌ ప్రయోగించారు. దీనిద్వారా ఆ మందు వారిపై ఎలా పనిచేసిందో వివరాలు సేకరించారు. కాగా ఇద్దరు వైద్యులు ఈ ట్రయల్స్ చేయగా, వివిధ కంపెనీల ప్రతినిధులు, ఇతరులు వీరికి సహాయంగా ఉన్నారు. గత పదేళ్లుగా నిలోఫర్‌లో క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నట్లు నివేదిక తెలిపింది. కాని ట్రయల్స్ జరిగిన పిల్లల ఆరోగ్య పరిస్థితి పై ఎలాంటి సమాచారం లేదు. క్లినికల్ ట్రయల్స్ జరిపినప్పుడు పిల్లలను వయసుల వారీగా విభజించి ప్రయోగాలు నిర్వహించారు. అయితే ప్రస్తుతం అక్కడ రోటా వైరస్ వ్యాక్సిన్‌కు సంబంధించిన క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నట్లు నివేదిక తెలిపింది.

మరో విషయం ఏమిటంటే.. ప్రయోగాలు జరిపిన పిల్లలు అందరూ పెద పిల్లలు. వీరిలో కొందరికి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినట్లు అనుమాలున్నారు. దీనిపై విచారణ జరిపించాలని నిపుణులు కోరుతున్నారు. అయితే కేంద్ర నివేదికలో పిల్లల వివరాలు, వారిపై ఎప్పుడు క్లినికల్ ట్రయల్స్ పూర్తి అయ్యాయన్న సమాచారాన్ని తెలుపలేదు. కాగా, గాంధీ, ఉస్మానియా, నిమ్స్, ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రుల్లో కూడా క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయని తేలింది. ఎంతో మంది పిల్లల భవిష్యత్తుకు హాని చేసే విధంగా.. వారికి తెలియకుండా ఈ క్లినికల్‌ ట్రయల్స్‌కు బాధ్యులైన వారిపై బదిలీ వేటు పడే అవకాశాలున్నట్లు వైద్య విద్యా విభాగం వర్గాలు చర్చించుకుంటున్నాయి.