ప్రైవేట్ ఆస్పత్రి నిర్లక్ష్యం.. మృతదేహం తారుమారు
హైదరాబాద్ మహానగరంలో మరోసారి ప్రైవేటు ఆస్పత్రుల భాగోతం బయటపడింది. కాసుల మీద యావ తప్ప రోగుల పట్ల శ్రద్ధ లేదని నిరూపణ అయ్యింది. ఓ ప్రవేటు ఆస్పత్రి సిబ్బంది నిర్వాకంతో మృతదేహాలు తారుమారయ్యాయి.
హైదరాబాద్ మహానగరంలో మరోసారి ప్రైవేటు ఆస్పత్రుల భాగోతం బయటపడింది. కాసుల మీద యావ తప్ప రోగుల పట్ల శ్రద్ధ లేదని నిరూపణ అయ్యింది. ఓ ప్రవేటు ఆస్పత్రి సిబ్బంది నిర్వాకంతో మృతదేహాలు తారుమారయ్యాయి. దహన సంస్కారాలు చేస్తుండగా అసలు విషయం బయటపడింది. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం గన్నారం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కరోనాతో చికిత్సపొందుతూ హైదరాబాద్లోని ఓ ప్రవేటు ఆస్పత్రిలో కన్నుమూశాడు. బిల్లు కడితేనే మృతదేహం అప్పగిస్తామని ఆస్పత్రి యాజమాన్యం తేల్చి చెప్పడంతో మృతుడి బంధువులు రూ.10లక్షలు చెల్లించారు. మృతదేహన్ని తీసుకుని వెళ్లి అంత్యక్రియల కోసం ఏర్పాట్లు చేశారు కుటుంబసభ్యులు. చివరిసారి చనిపోయిన వ్యక్తి మొఖం చూడాలనుకోవడంతో అసలు విషయం బయటపడింది. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా కారణంగా ఒక మృతదేహానికి బదులు మరో మృతదేహాన్ని అప్పగించినట్లు బంధువులు గుర్తించారు.
మృతదేహాన్ని చూపించండని బంధువులు ప్రాధేయపడినా నిబంధనలు ఒప్పుకోవని చితికి నిప్పుపెట్టే ప్రయత్నం చేశారు. చివరి క్షణంలో అంబులెన్స్ డ్రైవర్ ఫోన్ చేసి మృతదేహం వారిది కాదని చెప్పడంతో బంధువులు అవాక్కయ్యారు. దీంతో ఆస్పత్రి నిర్లక్ష్యంపై రోగి బంధువులు ఆగ్రహం వ్యక్తంచేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆస్పత్రి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంబులెన్స్ డ్రైవర్ ఫోన్ చేసి చెప్పకపోతే ఆ రెండు సెకెన్లలోనే చితికి నిప్పుపెట్టేవాళ్లమని.. రూ.10 లక్షలు బిల్లు కట్టినా వేరొకరి మృతదేహన్ని అప్పగించారంటూ కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు