విశాఖ మత్తు ఇంజెక్షన్ల ముఠా అరెస్ట్

యువతను టార్గెట్ చేస్తూ మత్తు మందు విక్రయిస్తున్న ముఠా మత్తు వదిలించారు విశాఖ పోలీసులు.. విశాఖపట్నంలో గుట్టుచప్పుడు కాకుండా మత్తు ఇంజక్షన్లను అమ్ముతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.

విశాఖ మత్తు ఇంజెక్షన్ల ముఠా అరెస్ట్
Follow us

|

Updated on: Sep 18, 2020 | 11:53 AM

యువతను టార్గెట్ చేస్తూ మత్తు మందు విక్రయిస్తున్న ముఠా మత్తు వదిలించారు విశాఖ పోలీసులు.. విశాఖపట్నంలో గుట్టుచప్పుడు కాకుండా మత్తు ఇంజక్షన్లను అమ్ముతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ముగ్గురు సభ్యులు గల ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 68 ఇంజక్షన్లు, ఓ కారుతో పాటు 5వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. మొబైల్‌ ఫోన్లను కూడా సీజ్‌ చేశారు. అప్పలరాజు, రవికుమార్‌, శ్రీనివాస్‌రావు ముఠాగా ఏర్పడి అక్రమంగా మత్తు ఇంజక్షన్లను విక్రయిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. పక్కా ఫ్లాన్ ప్రకారం ముగ్గురిని పట్టుకున్నారు. యువతను టార్గెట్‌ చేసుకుని సొమ్ము చేసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. ఇటీవల డ్రగ్స్‌ వినియోగం పెరిగిపోవడంతో పోలీసులు నిఘా పెట్టారు. దీంతో ఈ ముఠా కదలికలు పోలీసుల దృష్టికి రావడంతో.. దొరికిపోయారు.