పోలవరం ప్రాజెక్టును సందర్శించిన ప్రాజెక్టు ఆథారిటీ సభ్యుల బృందం.. నాలుగు రోజుల పాటు పర్యటించనున్న సభ్యులు.
పోలవరం ప్రాజెక్టు పనులను అధికారులు ఆదివారం సందర్శించారు. నాలుగు రోజుల పాటు సాగనున్న ఈ పర్యటనలో ప్రాజెక్టు ఆథారిటీ సీఈవో చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల బృందం పాల్గొన్నారు.
Polavaram project authority visit site: ఆంధ్రుల జీవనాడి పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం వద్ద నిర్మిస్తోన్న పోలవరం ప్రాజెక్టు పనులను అధికారులు ఆదివారం సందర్శించారు. నాలుగు రోజుల పాటు సాగనున్న ఈ పర్యటనలో ప్రాజెక్టు ఆథారిటీ సీఈవో చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల బృందం పాల్గొన్నారు. మెగా ఇంజనీరింగ్ సంస్థ పనులు చేపట్టిన తర్వాత పీపీఏ కమిటీ పనులను పరిశీలించడం ఇదే తొలిసారి. ఈ పర్యటనలో చంద్రశేఖర్తో పాటు డి.గణేష్ కుమార్, కే.లలిత కుమారి పాల్గొన్నారు. నిర్మాణం జరుగుతున్న విధానాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
పర్యటనలో భాగంగా సభ్యులు స్పిల్వేలో ఏర్పాటు చేస్తున్న గేట్ల నిర్మాణాన్ని పరిశీలించారు. ఇప్పటివరకు ఏర్పాటు చేసిన ఆర్మ్ గడ్డర్ల నాణ్యతను, బిగింపు పనులను పరిశీలించారు. కుడి, ఎడమ కాలువల కోసం చేపట్టిన భూసేకరణ ఎలా ఉన్నదనే అంశంపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టుకు రూ. 2230 కోట్లు నిధులు విడుదల చేశారని, ప్రస్తుతం పనులు, బిల్లులు పరిశీలించాక మరిన్ని నిధులు విడుదల చేయాలని కేంద్రానికి సిఫారసు చేయనున్నట్లు పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈవో చంద్రశేఖర్ అయ్యర్ మీడియాకు తెలిపారు.