తమిళనాడుపై పట్టుకోసం ప్రధాని కేంద్ర దర్యాప్తు సంస్థలను వినియోగిస్తున్నారు, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ధ్వజం

తమిళనాడుపై పట్టుకోసం ప్రధాని మోదీ కేంద్ర దర్యాప్తు సంస్థలను వినియోగిస్తున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు.

తమిళనాడుపై పట్టుకోసం ప్రధాని కేంద్ర దర్యాప్తు సంస్థలను వినియోగిస్తున్నారు, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ధ్వజం
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Jan 23, 2021 | 9:02 PM

తమిళనాడుపై పట్టుకోసం ప్రధాని మోదీ కేంద్ర దర్యాప్తు సంస్థలను వినియోగిస్తున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ తమిళనాడు భాష, సంస్కృతి, చరిత్ర గురించి ఆయనకు ఏమీ తెలియదని, కానీ దర్యాప్తు సంస్థల ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారని రాహుల్ అన్నారు. శనివారం కోయంబత్తూరులో రోడ్ షో నిర్వహించిన ఆయన.. తన గ్రాండ్ మదర్ కి,  తన తండ్రికి ఎంతో ప్రేమాభిమానాలను అందించిన ఈ రాష్ట్ర ఋణం తీర్చుకోలేనన్నారు. తమిళ ప్రజల హాక్కులపై పోరాటం కోసం తానిక్కడికి వచ్చానని రాహుల్ చెప్పారు. ఈ రాష్ట్రంలో మే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయన పలుమార్లు తమిళనాడును విజిట్ చేస్తున్నారు. ఇటీవలే మదురైలో జల్లికట్టును కూడా చూసి,, ఈ రాష్ట్ర భాష, సంస్కృతి, చరిత్ర ను ప్రస్తావించారు.