జైపాల్ రెడ్డి ఓ అద్భుతమైన వక్త : ప్రధాని మోదీ
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి మరణంతో రాజకీయ శ్రేణులు తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యాయి. ఆదివారం తెల్లవారుఝామున గచ్చిబౌలీలోని గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. జైపాల్ రెడ్డి మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం తెలియజేశారు. ఆయన ఓ అద్భుతమైన వక్త అంటూ పేర్కొన్నారు. ప్రజాసేవలో ఎంతో అనుభవమున్న నేత జైపాల్ రెడ్డంటూ ట్వీట్ చేశారు. సమర్థవంతమైన రాజకీయ నేతగా ఆయనకు గుర్తింపు ఉందని… ఆయన మరణం […]
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి మరణంతో రాజకీయ శ్రేణులు తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యాయి. ఆదివారం తెల్లవారుఝామున గచ్చిబౌలీలోని గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. జైపాల్ రెడ్డి మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం తెలియజేశారు. ఆయన ఓ అద్భుతమైన వక్త అంటూ పేర్కొన్నారు. ప్రజాసేవలో ఎంతో అనుభవమున్న నేత జైపాల్ రెడ్డంటూ ట్వీట్ చేశారు. సమర్థవంతమైన రాజకీయ నేతగా ఆయనకు గుర్తింపు ఉందని… ఆయన మరణం నన్ను ఎంతో బాధించిందన్నారు. ఆయన కుటుంబానికి, శ్రేయోభిలాషులకు నా ప్రగాఢ సానుభూతి అంటూ ట్వీట్లో పేర్కొన్నారు.
Shri Jaipal Reddy had years of experience in public life. He was respected as an articulate speaker and effective administrator. Saddened by his demise. My thoughts are with his family and well-wishers in this hour of grief: PM @narendramodi
— PMO India (@PMOIndia) July 28, 2019