Breaking 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ.. మోదీ మార్క్ ప్రకటన
లాక్డౌన్ నేపథ్యంలో జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. ఈ క్రమంలో 20 లక్షల కోట్ల ఆయన భారీ ఆర్థిక ప్యాకేజ్ ప్రకటించారు. స్వయం సమృద్ధి ఆర్థిక నిర్మాణానికి ఈ ప్యాకేజ్ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ‘ఆత్మనిర్భర్ భారత్’ పేరుతో ప్రకటించిన ఈ ప్యాకేజ్ డబ్బును వ్యవసాయం, కార్మికులు, లఘు, కుటీర పరిశ్రమల కోసం వెచ్చించనున్నారు. మన దేశ జీడీపీలో ఈ ప్యాకేజీ 10 శాతం అని ప్రధాని పేర్కొన్నారు. ప్యాకేజ్ సంబంధించిన పూర్తి వివరాలను బుధవారం ఆర్థిక మంత్రి […]
లాక్డౌన్ నేపథ్యంలో జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. ఈ క్రమంలో 20 లక్షల కోట్ల ఆయన భారీ ఆర్థిక ప్యాకేజ్ ప్రకటించారు. స్వయం సమృద్ధి ఆర్థిక నిర్మాణానికి ఈ ప్యాకేజ్ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ‘ఆత్మనిర్భర్ భారత్’ పేరుతో ప్రకటించిన ఈ ప్యాకేజ్ డబ్బును వ్యవసాయం, కార్మికులు, లఘు, కుటీర పరిశ్రమల కోసం వెచ్చించనున్నారు. మన దేశ జీడీపీలో ఈ ప్యాకేజీ 10 శాతం అని ప్రధాని పేర్కొన్నారు. ప్యాకేజ్ సంబంధించిన పూర్తి వివరాలను బుధవారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించనున్నారు.
- మొత్తం ప్రపంచాన్ని ఈ వైరస్ కకావికలం చేసింది: ప్రధాని మోదీ
- ఒక్క వైరస్ ప్రపంచాన్ని తలకిందులు చేసింది: ప్రధాని మోదీ
- భారత్ అభివృద్ధి చెందితే ప్రపంచానికి కొత్త దారి చూపిస్తుంది: ప్రధాని
- విశ్వమానవ కల్యాణానికి మనవంతు సహకారం అందిస్తున్నాం: ప్రధాని
- మనం స్వతంత్రంగా ఎదగడమే ఏకైక మార్గం: ప్రధాని మోదీ
- కరోనా తెచ్చిన ఆపదలను అవకాశాలుగా మలుచుకుంటున్నాం: ప్రధాని
- మనవద్ద తయారయ్యే వస్తువు ప్రపంచానికి కూడా ఇవ్వాలనేది మన దృక్పథం: ప్రధాని
- వసుధైక కుటుంబం అనే భావన మనల్ని ముందుకు నడిపిస్తోంది: ప్రధాని
- కరోనా నుంచి రక్షించుకోవాలి.. అదే సమయంలో ముందుకు సాగాలి: ప్రధాని
- కరోనాకు ముందు కరోనా తర్వాత విశ్లేషించుకోవాల్సిన పరిస్థితి: ప్రధాని మోదీ
- భారత్లో కూడా అనేక మంది అయినవారిని కోల్పోయారు: ప్రధాని
- భారత్ సర్కార్ నుంచి వెళ్లే ప్రతి రూపాయి ప్రతి శ్రామికుడి, రైతు జేబులోకి నేరుగా వెళ్తుంది
- భవిష్యత్తులో వ్యవసాయంపై ఎలాంటి ప్రభావం పడకుండా ఏర్పాట్లు
- మేకిన్ ఇండియా కార్యక్రమానికి ఈ ప్యాకేజీ మరింత బలాన్ని చేకూరుస్తుంది
- చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఆర్థిక ప్యాకేజీ ద్వారా ఊతం