మహారాష్ట్రలో త్వరలో ‘మోగనున్న గుడి గంటలు’, సీఎం ఉధ్ధవ్ థాక్రే
రాష్ట్రంలో త్వరలో దేవాలయాలను తెరిచే అవకాశం ఉందని మహారాష్ట్ర సీఎం ఉధ్ధవ్ థాక్రే తెలిపారు. దీపావళి పండుగ తరువాత తిరిగి ఆలయాలను, ప్రార్థనా మందిరాలు, మసీదులను మళ్ళీ తెరవవచ్చునన్నారు. అయితే కోవిడ్ నేపథ్యంలో గుంపులుగా జనం వీటిలో ప్రవేశించకుండా చూసేందుకు కొత్త గైడ్ లైన్స్ విడుదల చేస్తామన్నారు. ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ కి కోవిడ్ రిస్క్ ఉంటుందని నిపుణులు తెలిపారని, ఒక్క వృధ్ధుడు సుమారు నాలుగు వందలమందికి ఈ వైరస్ సోకింప జేసే అవకాశం ఉందన్నారని, అందువల్లే […]
రాష్ట్రంలో త్వరలో దేవాలయాలను తెరిచే అవకాశం ఉందని మహారాష్ట్ర సీఎం ఉధ్ధవ్ థాక్రే తెలిపారు. దీపావళి పండుగ తరువాత తిరిగి ఆలయాలను, ప్రార్థనా మందిరాలు, మసీదులను మళ్ళీ తెరవవచ్చునన్నారు. అయితే కోవిడ్ నేపథ్యంలో గుంపులుగా జనం వీటిలో ప్రవేశించకుండా చూసేందుకు కొత్త గైడ్ లైన్స్ విడుదల చేస్తామన్నారు. ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ కి కోవిడ్ రిస్క్ ఉంటుందని నిపుణులు తెలిపారని, ఒక్క వృధ్ధుడు సుమారు నాలుగు వందలమందికి ఈ వైరస్ సోకింప జేసే అవకాశం ఉందన్నారని, అందువల్లే ఈ విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. ప్రతివారూ మాస్కులు ధరించాల్సిందేనని, ఈ నిబంధనను అతిక్రమిస్తే జరిమానాలు తప్పవని ఆయన హెచ్చరించారు. స్కూళ్లను కూడా దీపావళి తరువాత 9 నుంచి 12 తరగతుల వరకు తెరిచే సూచన ఉందని ఆయన చెప్పారు.