మరోసారి పెరిగిన పెట్రోల్ ధర
దేశీయ పెట్రోల్ ధరలను చమురు సంస్థలు మరో సారి పెంచాయి. అయితే డిజీల్ రేట్లలో ప్రస్తుతం ఎలాంటి మార్పు లేదు. నేటి పెంపుతో గత పది రోజుల్లో పెట్రోల్ ధరలను తొమ్మిది సార్లు పెంచారు...
దేశీయ పెట్రోల్ ధరలను చమురు సంస్థలు మరో సారి పెంచాయి. అయితే డిజీల్ రేట్లలో ప్రస్తుతం ఎలాంటి మార్పు లేదు. నేటి పెంపుతో గత పది రోజుల్లో పెట్రోల్ ధరలను తొమ్మిది సార్లు పెంచారు. పెట్రోల్ లీటరుకు 9 నుంచి 11 పైసల వరకు పెంచినట్లుగా ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ ఓ ప్రకటనలో తెలిపింది.
హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర 14 పైసలు, ఢిల్లీ, బెంగళూరు నగరాల్లో 13 పైసలు పెంచాయి. ముంబై, చెన్నై, కోల్కతాల్లో 12 పైసలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ.84.94కు పెరిగింది. ఢిల్లీలో రూ.81.73, ముంబైలో రూ.88.39గా రికార్డయింది.
హైదరాబాద్లో పెట్రోల్ ధర రూ.84.94, డీజిల్ ధర రూ.80.17
చెన్నైలో పెట్రోల్ ధర రు.84.73, డీజిల్ ధర రూ.78.86 బెంగళూరులో పెట్రోల్ ధర రూ.84.39, డీజిల్ ధర రూ.77.88
ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రు.81.73, డీజిల్ ధర రూ.73.56 కోల్కతాలో పెట్రోల్ ధర రూ.83.24, డీజిల్ ధర రూ.77.06 ముంబైలో పెట్రోల్ ధర రూ.88.39, డీజిల్ ధర రూ. 80.11