వెంగయ్య మరణంతో వైసీపీ పతనం స్టార్ట్ అయ్యింది, 151 సీట్లు ఇస్తే, ఒక బిడ్డకి తండ్రిని లేకుండా చేశారు : పవన్

వైసీపీ ప్రభుత్వానికి 151 సీట్లు ఇస్తే ఒక బిడ్డకి తండ్రిని లేకుండా చేశారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన కార్యకర్త వెంగయ్య...

వెంగయ్య మరణంతో వైసీపీ పతనం స్టార్ట్ అయ్యింది, 151 సీట్లు ఇస్తే, ఒక బిడ్డకి తండ్రిని లేకుండా చేశారు : పవన్
Follow us

|

Updated on: Jan 23, 2021 | 7:01 PM

వైసీపీ ప్రభుత్వానికి 151 సీట్లు ఇస్తే ఒక బిడ్డకి తండ్రిని లేకుండా చేశారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన కార్యకర్త వెంగయ్య మరణంతో వైసీపీ పతనం స్టార్ట్ అయ్యిందని పవన్ కళ్యాణ్ అన్నారు. ఊరికి రోడ్డు అడిగితే జనసేన కార్యకర్త వెంగయ్యని వైసీపీ నాయకులు చంపేశారన్నారు. ప్రజాప్రతినిధులు వారి కుటుంబాలు బాగుండాలనుకుని, ప్రశ్నించే వారిని చంపేస్తారా అని పవన్ ప్రశ్నించారు. ఒంగోలులో జనసేన కార్యకర్త వెంగయ్య కుటుంబ సభ్యులను పవన్ కళ్యాణ్ శనివారం పరామర్శించారు. వెంగయ్య కుటుంబానికి జనసేన తరపున 8.5 లక్షలు ఆర్థిక సాయం అందించారు. వెంగయ్య భార్య, కుటుంబ సభ్యులతో కలిసి పవన్, జిల్లా ఎస్పీ సిద్దార్థ కౌశల్‌ని కలిశారు. వెంగయ్య మృతికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరారు. అనంతరం వైసీపీ సర్కారుపై పవన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంగయ్య చావుకి కారణమైన గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబుని ప్రభుత్వం సస్పెండ్ చేయగలదా…? కనీసం మందలించగలరా..? అని పవన్ ప్రశ్నించారు. వెంగయ్య మరణానికి కారణమైన వారిపై ఇప్పుడు చర్యలు తీసుకోకపోతే, జనసేన అధికారంలోకి వచ్చిన తరువాత చర్యలు తప్పవని హెచ్చరించారు.