పాక్లో హిందువులపై కొనసాగుతున్న అరాచకాలు.. పెళ్లి పీటలపై వధువును అపహరించి.. ఆపై..
పాకిస్థాన్లో మైనార్టీలుగా ఉన్న హిందువులపై అరాచకాలకు దిగుతున్నారు అక్కడి ముస్లింలు. ముఖ్యంగా హిందూ యువతులే లక్ష్యంగా దాడులకు దిగుతున్నారు. యుక్త వయస్సులో ఉన్న అమ్మాయిలను కిడ్నాప్ చేసి బలవంతంగా మతం మారుస్తున్నారు. అంతేకాదు ఆపై వారిని బలవంతంగా పేరు మార్చి.. వివాహం చేసుకుంటున్నారు. తాజాగా సింధ్ ప్రావిన్స్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ ఇరవై నాలుగేళ్ల హిందూ యువతి వివాహం జరుగుతుండగా.. కొందరు దుండగులు అమ్మాయిని పెళ్లి పీటలపై నుంచి బలవంతంగా లాక్కెళ్లారు. ఆపై ఆ యువతిని […]
పాకిస్థాన్లో మైనార్టీలుగా ఉన్న హిందువులపై అరాచకాలకు దిగుతున్నారు అక్కడి ముస్లింలు. ముఖ్యంగా హిందూ యువతులే లక్ష్యంగా దాడులకు దిగుతున్నారు. యుక్త వయస్సులో ఉన్న అమ్మాయిలను కిడ్నాప్ చేసి బలవంతంగా మతం మారుస్తున్నారు. అంతేకాదు ఆపై వారిని బలవంతంగా పేరు మార్చి.. వివాహం చేసుకుంటున్నారు. తాజాగా సింధ్ ప్రావిన్స్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ ఇరవై నాలుగేళ్ల హిందూ యువతి వివాహం జరుగుతుండగా.. కొందరు దుండగులు అమ్మాయిని పెళ్లి పీటలపై నుంచి బలవంతంగా లాక్కెళ్లారు. ఆపై ఆ యువతిని ఇస్లాంలోకి మతం మార్చి.. షారుఖ్ గుల్ అనే ముస్లిం యువకుడితో వివాహం జరిపించారు. సింధ్ ప్రావిన్స్లోని హలా పట్టణంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఈ ఘటనపై పాక్లోని మైనార్టీలు తీవ్ర నిరసనలు తెల్పుతున్నారు. కేవలం హిందువులనే కాకుండా.. అటు క్రిస్టియన్, సిక్కు యువతులను కూడా కిడ్నాప్ చేసి.. మతం మారుస్తూ వివాహాలు చేసుకుంటున్నారు. హలాలో జరిగిన ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన.. అక్కడి మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి హరిరామ్ కిశోర్ అధికారుల నుంచి నివేదిక కోరారు. ఇటు భారత ప్రభుత్వం కూడా ఈ విషయంపై ప్రత్యేక దృష్టిసారించింది. ఢిల్లీలోని పాక్ హైకమిషన్కు చెందిన సీనియర్ ఉద్యోగిని పిలిపించి.. నిరసన వ్యక్తం చేసింది. ఇదిలా ఉంటే.. దుండగులు కిడ్నాప్ చేసిన యువతి.. గతేడాది డిసెంబర్లోనే బనోరీ పట్టణంలో ఇస్లాం మతం స్వీకరించిందంటూ.. గుల్ సోషల్ మీడియాలో కొన్నిపత్రాలను పెట్టారు. కాగా, పాక్లో కేవలం సింధ్ ప్రాంతంలోనే హిందువులు కొంచెం ఎక్కువగా ఉంటారు. అయితే ప్రస్తుతం ఈ ప్రాంతాన్నే లక్ష్యంగా చేసుకుని హిందూ యువతులను అపహరించుకుపోతూ.. బలవంతపు మతమార్పిడులు చేస్తున్నారు. ఈ నెలలోనే ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం ఇది రెండోది. వరుస ఘటనలపై పాక్లోని మైనార్టీలు భయబ్రాంతులకు గురవుతున్నారు.