ఉత్తర అరేబియా సముద్రంలో పాక్ క్షిపణుల ప్రయోగాలు
ఒకవైపు ప్రపంచమంతా కోవిడ్ మహమ్మారిపై పోరాటలు సాగిస్తుంటే.. పాక్ మాత్రం తన యుద్ధ, ఆయుధ సామర్థ్యాన్ని పెంపొందించుకునే పనిలో పడింది. తాజాగా పాక్ నావికాదళం ఉత్తర అరేబియా సముద్రంలో వరుస యాంటీ షిప్..
ఒకవైపు ప్రపంచమంతా కోవిడ్ మహమ్మారిపై పోరాటలు సాగిస్తుంటే.. పాక్ మాత్రం తన యుద్ధ, ఆయుధ సామర్థ్యాన్ని పెంపొందించుకునే పనిలో పడింది. తాజాగా పాక్ నావికాదళం ఉత్తర అరేబియా సముద్రంలో వరుస యాంటీ షిప్ మిసైల్స్ను విజయవంతంగా పరీక్షించింది. వీటిని యుద్ధ నౌకలు, విమానాల ద్వారా ప్రయోగించినట్లు పాక్ నేవీ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. అలాగే నావికాదళం ప్రధానాధికారి జాఫర్ మహమ్మద్ అబ్బాసి సమక్షంలో ఈ పరీక్షలు జరినట్లు తెలిపారు. కాగా గతేడాది ఆగష్టులో జమ్మూకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసినప్పటి నుంచి భారత్-పాక్ మధ్య సంబంధాలు మరింత దెబ్బతిన్నాయి. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలోనే పాక్ మన దేశంలో దౌత్య సంబంధాలను తగ్గించింది.
Read More:
లాక్డౌన్ ఫ్రస్ట్రేషన్ తెలిపితే.. డబ్బులే డబ్బులు!
అక్షయ తృతీయ బంపర్ ఆఫర్.. ఒక్క రూపాయితో బంగారాన్ని కొనుగోలు చేసుకోవచ్చు!