పాక్‌లో దారుణం.. అబ్బాయితో మాట్లాడారని.. కాల్చి చంపేశారు..

పాకిస్థాన్.. ఈ దేశం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచంలో ఎక్కడా జరగని ఆకృత్యాలన్నీ కూడా ఈ పాపిష్టి దేశంలోనే జరుగుతాయి. ఉగ్రవాదం, కుల వివక్ష, హత్యలు.. ఇలా ఒకటేమిటి అక్కడ జరిగేవన్నీ కూడా సభ్యసమాజం తలదించుకునే విధంగా ఉంటాయి. తాజాగా అక్కడ జరిగిన ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. అబ్బాయితో మాట్లాడారని ఇద్దరు అమ్మాయిలను దారుణంగా హత్య చేశారు. అది కూడా పరువు హత్యలు. పోలీసుల కధనం ప్రకారం.. పాకిస్తాన్‌లోని ఉత్తర వాయువ్య గిరిజన […]

పాక్‌లో దారుణం.. అబ్బాయితో మాట్లాడారని.. కాల్చి చంపేశారు..
Follow us

|

Updated on: May 18, 2020 | 7:57 PM

పాకిస్థాన్.. ఈ దేశం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచంలో ఎక్కడా జరగని ఆకృత్యాలన్నీ కూడా ఈ పాపిష్టి దేశంలోనే జరుగుతాయి. ఉగ్రవాదం, కుల వివక్ష, హత్యలు.. ఇలా ఒకటేమిటి అక్కడ జరిగేవన్నీ కూడా సభ్యసమాజం తలదించుకునే విధంగా ఉంటాయి. తాజాగా అక్కడ జరిగిన ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. అబ్బాయితో మాట్లాడారని ఇద్దరు అమ్మాయిలను దారుణంగా హత్య చేశారు. అది కూడా పరువు హత్యలు.

పోలీసుల కధనం ప్రకారం.. పాకిస్తాన్‌లోని ఉత్తర వాయువ్య గిరిజన ప్రాంతంలో ఈ హత్యలు జరిగినట్లు తెలుస్తోంది. మే 14న 16, 18 సంవత్సరాల వయసు కలిగిన ఇద్దరు బాలికల హత్యలు జరగ్గా.. ఆ ఇద్దరు అమ్మాయిలను వారి కుటుంబసభ్యులే హతమార్చారని ప్రాధమిక విచారణలో తేలింది. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారు బాధితుల్లో ఒకరి తండ్రి కాగా, మరొక బాధితురాలి సోదరుడు అని తెలుస్తోంది.

తాజాగా ఏడాది క్రితానికి సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. అందులో ఓ అబ్బాయి, ముగ్గురు అమ్మాయిలతో కలిసి మాట్లాడుతున్నాడు. దాన్ని జీర్ణించుకోలేక వీడియోలోని ఇద్దరు అమ్మాయిలను వారి కుటుంబసభ్యులు దారుణంగా హత్య చేశారు. ఇక ఆ వీడియోలో ఉన్న మూడో అమ్మాయి ప్రస్తుతం బ్రతికే ఉందని.. ఆమె ప్రాణానికి ప్రమాదం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, వారు ఆ వీడియోలోని అమ్మాయి, అబ్బాయి ఆచూకీ వెతికే పనిలో పడ్డారు.