ఈ జత ఎడ్ల ధర ఏకంగా రూ.17లక్షలు !
కర్ణాటకలోని బాగల్కోట్లో జత ఎడ్లు అదిరిపోయే రేటుకు అమ్ముడయ్యాాయి. జత ఎడ్లను ఏకంగా రూ. 17 లక్షలకు అమ్మాడు ఓ వ్యవసాయదారుడు.
కర్ణాటకలోని బాగల్కోట్లో జత ఎడ్లు అదిరిపోయే రేటుకు అమ్ముడయ్యాయి. జత ఎడ్లను ఏకంగా రూ. 17 లక్షలకు అమ్మాడు ఓ వ్యవసాయదారుడు. మహాలింగపుర్లోని నందగావ్లో సంగప్ప అనే రైతు, అక్కిమారడికి చెందిన మల్లప్ప దగ్గరి నుంచి 2018లో ఆ ఎడ్లను కొన్నాడు. అప్పుడు వాటి విలువ 8 లక్షల రూపాయలు. ఆ తర్వాత వాటికి రామ్-లక్ష్మణ్ అనే పేరు పెట్టి.. ఎంతో అపురూపంగా చూసుకున్నాడు సంగప్ప.
48 పోటీల్లో పాల్గొన్న ఈ ఎడ్లు ఇప్పటివరకు సుమారు రూ. 9 లక్షల రూపాయల ప్రైజులు గెలిచాయి. దాదాపు అన్ని రేసుల్లోనూ ఇవి ఫస్ట్, సెకండ్ స్థానాల్లో నిలిచేవి. అనివార్య కారణాల వల్ల..ఇప్పుడు మళ్లీ మల్లప్పకే వాటిని రూ.17 లక్షలకు విక్రయించాడు సంగప్ప. ( Bigg Boss Telugu 4 : హౌస్ నుంచి సుజాత్ ఔట్ !..రీజన్స్ ఇవే ! )