రాయ్పూర్లో కుప్పకూలిన నాలుగంతస్తుల భవనం.. ముగ్గురి మృతి
చత్తీస్గఢ్ లోని రాయ్పూర్లో ఘోర ప్రమాదం జరిగింది. ఖాన్ తారై ప్రాంతంలో నాలుగు అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అందరు చూస్తుండగానే బిల్డింగ్ నేలమట్టమైంది. ఈ ఘటనలో ముగ్గురు చనిపోయారు. పలువురికి గాయాలయ్యాయి. హఠాత్తుగా బిల్డింగ్ కుప్పకూలడంతో చుట్టుపక్కలవారు భయంతో పరుగులు తీశారు. సమాచారమందుకున్న రెస్క్యూ టీం సహాయక చర్యలు చేపట్టింది. గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించారు. శిధిలాల కింద చిక్కుకున్నవారిని వెలికితీసే ప్రయత్నం ఇంకా కొనసాగుతోంది.
చత్తీస్గఢ్ లోని రాయ్పూర్లో ఘోర ప్రమాదం జరిగింది. ఖాన్ తారై ప్రాంతంలో నాలుగు అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అందరు చూస్తుండగానే బిల్డింగ్ నేలమట్టమైంది. ఈ ఘటనలో ముగ్గురు చనిపోయారు. పలువురికి గాయాలయ్యాయి. హఠాత్తుగా బిల్డింగ్ కుప్పకూలడంతో చుట్టుపక్కలవారు భయంతో పరుగులు తీశారు. సమాచారమందుకున్న రెస్క్యూ టీం సహాయక చర్యలు చేపట్టింది. గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించారు. శిధిలాల కింద చిక్కుకున్నవారిని వెలికితీసే ప్రయత్నం ఇంకా కొనసాగుతోంది.