లాక్‌డౌన్ ఉల్లంఘించినందుకు.. 3 వేల మంది అరెస్ట్..

కోవిద్-19 భారత్ లో విజృంభిస్తోంది. ఈ వైరస్ ను కట్టడికోసం లాక్ డౌన్ పొడిగించిన విషయం తెలిసిందే. దేశ రాజధాని ఢిల్లీలో మూడు వేల మందికి పైగా లాక్‌డౌన్ ఉల్లంఘించిన వారిని పోలీసులు ఇవాళ అరెస్టు చేశారు.

లాక్‌డౌన్ ఉల్లంఘించినందుకు.. 3 వేల మంది అరెస్ట్..
Follow us

| Edited By:

Updated on: Apr 20, 2020 | 9:26 PM

కోవిద్-19 భారత్ లో విజృంభిస్తోంది. ఈ వైరస్ ను కట్టడికోసం లాక్ డౌన్ పొడిగించిన విషయం తెలిసిందే. దేశ రాజధాని ఢిల్లీలో మూడు వేల మందికి పైగా లాక్‌డౌన్ ఉల్లంఘించిన వారిని పోలీసులు ఇవాళ అరెస్టు చేశారు. దాదాపు 273 కేసులు నమోదు చేసినట్టు అధికారులు వెల్లడించారు. ఢిల్లీ పోలీసుల వద్దవున్న వివరాల ప్రకారం సెక్షన్ 65 కింద 3,562 మందిని అదుపులోకి తీసుకున్నారు.

కాగా.. సెక్షన్ 188 కింద ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు 273 కేసులు నమోదు చేశారు. మరోవైపు 331 వాహనాలను కూడా పోలీసులు సీజ్ చేశారు. మాస్కులు లేకుండా బయటికి వచ్చిన వారిపై 160కి పైగా కేసులు నమోదయ్యాయి. గత నెల 24నుంచి ఇప్పటి వరకు ఢిల్లీ పోలీసులు లక్ష మందికి పైగా లాక్‌డౌన్ ఉల్లంఘనులను అరెస్ట్ చేశారు.

Also Read: రూ.500కే కరోనా టెస్టింగ్ కిట్.. 15 నిమిషాల్లో ఫలితం..