చైనాలో ఘోర రైలు ప్రమాదం.. పట్టాలపై పడ్డ కొండచరియలు.. బ్రేకులు వేసినా..

ఇప్పుడిప్పుడే కరోనా నుంచి కోలుకుంటున్న చైనాలో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా.. 127 మందికి పైగా తీవ్రగాయాల పాలయ్యారు. ఈ ఘటన చైనాలోని హునాన్ ప్రావిన్స్‌లో సోమవారం చోటుచేసుకుంది. చెంజో సిటీ నుంచి గాంగ్‌‌జో ప్రాంతానికి వేగంగా వెళ్తుండగా.. అందులో ఉన్న లోకోపైలట్‌.. పట్టాలపై కొండచరియలు విరిగిపడి ఉండటాన్ని గమనించాడు. వెంటనే స్పందించిన ఆ లోకో పైలట్‌.. ఎమర్జెన్సీ బ్రేక్స్‌ వేశాడు. కానీ అప్పటికే ఆ ట్రైన్.. పట్టాలపై పడి ఉన్న […]

చైనాలో ఘోర రైలు ప్రమాదం.. పట్టాలపై పడ్డ కొండచరియలు.. బ్రేకులు వేసినా..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Mar 30, 2020 | 8:47 PM

ఇప్పుడిప్పుడే కరోనా నుంచి కోలుకుంటున్న చైనాలో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా.. 127 మందికి పైగా తీవ్రగాయాల పాలయ్యారు. ఈ ఘటన చైనాలోని హునాన్ ప్రావిన్స్‌లో సోమవారం చోటుచేసుకుంది. చెంజో సిటీ నుంచి గాంగ్‌‌జో ప్రాంతానికి వేగంగా వెళ్తుండగా.. అందులో ఉన్న లోకోపైలట్‌.. పట్టాలపై కొండచరియలు విరిగిపడి ఉండటాన్ని గమనించాడు. వెంటనే స్పందించిన ఆ లోకో పైలట్‌.. ఎమర్జెన్సీ బ్రేక్స్‌ వేశాడు. కానీ అప్పటికే ఆ ట్రైన్.. పట్టాలపై పడి ఉన్న రాళ్లగుట్టను ఢీకొట్టింది. దీంతో అయిదు బోగీలు పట్టాలు తప్పి పడిపోగా.. ఇంజిన్‌లో మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.127 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.