ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్
ఏపీలోని సీఎం జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల డిపార్ట్మెంట్ పరీక్షల్లో నెగెటివ్ మార్కుల విధానం తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఏపీలోని సీఎం జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల డిపార్ట్మెంట్ పరీక్షల్లో నెగెటివ్ మార్కుల విధానం తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే ఈ ఫైలుపై సీఎం జగన్ సంతకం చేశారని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం చైర్మన్ వెంకట్రామిరెడ్డి వారం రోజుల క్రితం వెల్లడించారు. తాజాగా ఏపీపీఎస్సీ ద్వారా నిర్వహించే శాఖాపరమైన పరీక్షల్లో ఇక నుంచి నెగెటివ్ మార్కింగ్ ఉండబోదని స్పష్టమైన ఆదేశాలు ఇస్తూ.. సాధారణ పరిపాలన శాఖ సర్వీసుల విభాగం ముఖ్యకార్యదర్శి శశిభూషణ్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఏపీలో 2016 నుంచి ప్రభుత్వం ఉద్యోగుల డిపార్ట్మెంట్ పరీక్షలలో నెగటివ్ మార్కుల విధానం అమలవుతోంది. ఒక తప్పు సమాధానానికి 1/3 వంతు మార్కులు కట్ చేస్తున్నారు. దీనితో ఉద్యోగులు డిపార్ట్మెంట్ పరీక్షలలో పాస్ కావాటం కష్టతరంగా మారింది. పరీక్ష రాస్తున్నవారిలో 10 శాతం కూడా పాస్ అవ్వడం లేదు. దీని వలన చాలామంది ఉద్యోగులు సకాలంలో ఇంక్రిమెంట్, ప్రమోషన్ పొందలేకపోతున్నారు. ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఈ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లగా…. నెగటివ్ మార్కుల విధానాన్ని తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
Also Read :
Breaking : తెలంగాణలో తెరుచుకోనున్న బార్లు, పబ్బులు, క్లబ్బులు !