ఆ ఆల‌య ప్ర‌వేశం ‌వారికి మాత్రమే..!

దేశంలో కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఉజ్జ‌యిని‌ మహాకాళేశ్వర్ ఆలయ పరిపాలన క‌మిటీ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

ఆ ఆల‌య ప్ర‌వేశం ‌వారికి మాత్రమే..!
Follow us

| Edited By:

Updated on: Jul 23, 2020 | 11:54 AM

No entry for devotees: దేశంలో కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఉజ్జ‌యిని‌ మహాకాళేశ్వర్ ఆలయ పరిపాలన క‌మిటీ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇతర రాష్ట్రాల నుంచి వ‌చ్చే భ‌క్తుల‌కు ఆల‌య ప్రవేశాన్ని నిషేధిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. క‌మిటీ తదుపరి నిర్ణ‌యం ప్ర‌క‌టించే వరకు మధ్యప్రదేశ్‌కు చెందిన‌వారు మాత్రమే మ‌హాకాళేశ్వ‌రుణ్ణి ద‌ర్శించుకోగ‌ల‌గుతారు.

కరోనా సంక్షోభ సమయంలో.. మార్చి 21న మూసివేసిన మహాకాళేశ్వ‌రుని ఆల‌యం 78 రోజుల తరువాత తిరిగి జూన్ 8న తెరుచుకుంది. రాష్ట్రంలో క‌రోనా వైర‌స్ ఎక్కువగా ప్రభావితమైన జిల్లాలలో ఉజ్జయిని ఒకటి. జిల్లాలో ఇప్పటివరకు మొత్తం 942 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. 71 మంది మృతిచెందారు. 798 మంది క‌రోనా బాధితులు చికిత్స అనంత‌రం కోలుకున్నారు.

Also Read: ఎంట్రెన్స్‌ పరీక్షలు రద్దు.. డీమ్డ్‌ వర్సిటీలకు డిమాండ్..