నిజామాబాద్ ఎమ్మెల్సీ వీజీ గౌడ్​కు కరోనా పాజిటివ్..

Nizamabad MLC Tests Corona Positive: తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 80 వేలకు చేరువైంది. సామాన్యుల నుంచి ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, కేంద్రమంత్రులు ఇలా అందరూ కూడా ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఇప్పటికే హోం మంత్రి మహమూద్ అలీ, డిప్యూటీ స్పీకర్ పద్మారావు, మంత్రి మల్లారెడ్డి లాంటి పలువురు పొలిటికల్ లీడర్స్‌కు కరోనా […]

నిజామాబాద్ ఎమ్మెల్సీ వీజీ గౌడ్​కు కరోనా పాజిటివ్..
Follow us

|

Updated on: Aug 09, 2020 | 1:48 PM

Nizamabad MLC Tests Corona Positive: తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 80 వేలకు చేరువైంది. సామాన్యుల నుంచి ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, కేంద్రమంత్రులు ఇలా అందరూ కూడా ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఇప్పటికే హోం మంత్రి మహమూద్ అలీ, డిప్యూటీ స్పీకర్ పద్మారావు, మంత్రి మల్లారెడ్డి లాంటి పలువురు పొలిటికల్ లీడర్స్‌కు కరోనా సోకిన సంగతి తెలిసిందే.

ఇక తాజాగా నిజామాబాద్ ఎమ్మెల్సీ వీజీ గౌడ్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వీళ్లందరూ కూడా నిమ్స్‌లో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీజీ గౌడ్ కుటుంబమంతా హైదరాబాద్‌లో హోం క్వారంటైన్‌లో ఉంది. డాక్టర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. కాగా.. గతవారం రోజులుగా ఆయనను కలిసిన కార్యకర్తలు, నేతలు, బంధువులు కరోనా టెస్ట్‌లు చేయించుకోవాలని వైద్యాధికారులు స్పష్టం చేశారు.