నితీష్ మళ్ళీ సీఎం కాలేరు, ఈ ఎన్నికలే నిదర్శనం, చిరాగ్ పాశ్వాన్

బీహార్ మూడో (తుది) దశ ఎన్నికలు శనివారం జరుగుతున్నాయని, నితీష్ కుమార్ మళ్ళీ ముఖ్యమంత్రి కాలేరని ఈ ఎన్నికలు రుజువు చేస్తాయని లోక్ జనశక్తి పార్టీ నేత చిరాగ్ పాశ్వాన్ అన్నారు.

నితీష్ మళ్ళీ సీఎం కాలేరు, ఈ ఎన్నికలే నిదర్శనం, చిరాగ్ పాశ్వాన్
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Nov 07, 2020 | 10:56 AM

బీహార్ మూడో (తుది) దశ ఎన్నికలు శనివారం జరుగుతున్నాయని, నితీష్ కుమార్ మళ్ళీ ముఖ్యమంత్రి కాలేరని ఈ ఎన్నికలు రుజువు చేస్తాయని లోక్ జనశక్తి పార్టీ నేత చిరాగ్ పాశ్వాన్ అన్నారు. క్షేత్ర స్థాయిలో తానొక్కడినే ఈ మొత్తం ఎన్నికల ప్రక్రియ ట్రెండ్ ను పరిశీలించానని, తొలి, రెండో దశ ఎన్నికలు ఈ విషయాన్ని దాదాపుగా ధృవీకరిస్తే, ఈ చివరి దశ ఎలక్షన్స్ దానిపై ‘ఫైనల్  స్టాంప్’ వేశాయని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్ఛే కొత్త ప్రభుత్వం అభివృధ్ది ప్రాతిపదికపై ఏర్పడుతుందన్నారు. గత 15 ఏళ్ళ కన్నా రానున్న ఐదేళ్లు ఈ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలనుకుంటే ప్రజలకు ఇదే మంచి అవకాశం అని చిరాగ్ పాశ్వాన్ పేర్కొన్నారు. ఈ నెల 10 తరువాత ఎవరు సీఎం అవుతారన్నది తేలిపోతుందన్నారు.