నిమ్స్లో కరోనా ట్రైయల్స్ వేగవంతం
హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో కరోనా ట్రైయల్స్ స్పీడ్గా జరుగుతున్నాయి. ప్రభుత్వం అనుకున్నదానికంటే వేంగంగా క్లినికల్ ట్రయల్స్ ముందుకెళ్తున్నాయి. ఇప్పటికే నిమ్స్ ఆస్పత్రిలో బూస్టర్ డోస్ ప్రారంభమైయింది.
భారత్లో కరోనా వాక్సిన్ హ్యూమన్ ట్రయల్స్ కొనసాగుతున్నాయి. తొలి స్వదేశీ వాక్సిన్ ‘కొవాగ్జిన్’పై హైదరాబాద్తో పాటు ఇతర ప్రాంతాల్లో ప్రయోగాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో కరోనా ట్రైయల్స్ స్పీడ్గా జరుగుతున్నాయి. ప్రభుత్వం అనుకున్నదానికంటే వేంగంగా క్లినికల్ ట్రయల్స్ ముందుకెళ్తున్నాయి. ఇప్పటికే నిమ్స్ ఆస్పత్రిలో బూస్టర్ డోస్ ప్రారంభమైయింది. మొదటి, రెండో దశకు మధ్యలో ఉన్న వాలంటీర్లకు ఈ బూస్టర్ డోస్ను ఇచ్చారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు నిమ్స్ డాక్టర్లు తెలిపారు. మంగళవారం 11 మంది వాలంటీర్లకు బూస్టర్ డోస్ ఇచ్చామని వైద్యులు తెలిపారు. ఇవాళ మరో మరో 10 మంది వాలంటీర్లకు వైద్య బృందం బూస్టర్ డోస్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
వాక్సిన్లోని అన్ యాక్టివేటెడ్ వైరస్ వల్ల శరీరంలోని యాంటీ బాడీలు ఏ మేరకు వృద్ధి చెందుతాయి? సైడ్ ఎఫెక్ట్స్ ఏవైనా ఉన్నాయా? అని పరిశీలిస్తున్నారు. అంతా ఓకే అనుకున్న తర్వాత రెండో డోస్ ఇస్తున్నారు. ఇలా మొత్తం 60 మందిపై నిమ్స్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. కొవాగ్జిన్ వాక్సిన్ను భారత వైద్య పరిశోధనా మండలి , నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సహకారంతో ఈ భారత్ బయోటెక్ కంపెనీ అభివృద్ధి చేసింది. ఈ వ్యాక్సీన్ను మనుషులపై ప్రయోగించేందుకు గాను ఫేజ్-1, ఫేజ్-2 క్లినికల్ ట్రయల్స్కు ఇప్పటికే డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతి ఇచ్చింది.