బాలీవుడ్ ప్రముఖులకు నికీషా పటేల్ సూటి ప్రశ్నలు

కంగన, తాప్సీ, శ్రద్ధాదాస్, పాయల్ వంటి హీరోయిన్లు చాలా విమర్శలు గుప్పించారు. వీరితో `కొమురం పులి` హీరోయిన్ నికీషా పటేల్ కూడా జత కట్టారు. ట్విట్టర్‌లో ప్రశ్నల వర్షం కురిపించారు...

బాలీవుడ్ ప్రముఖులకు నికీషా పటేల్ సూటి ప్రశ్నలు
Follow us

|

Updated on: Jun 18, 2020 | 5:57 PM

బాలీవుడ్ యంగ్ స్టార్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య బాలీవుడ్‌ను కుదిపేస్తోంది. అక్కడి బంధుప్రీతిపై మరోసారి చర్చ మొదలైంది. ఇప్పటికే కంగన, తాప్సీ, శ్రద్ధాదాస్, పాయల్ వంటి హీరోయిన్లు చాలా విమర్శలు గుప్పించారు. వీరితో `కొమురం పులి` హీరోయిన్ నికీషా పటేల్ కూడా జత కట్టారు. ట్విట్టర్‌లో ప్రశ్నల వర్షం కురిపించారు.

బాలీవుడ్ ప్రముఖులను టార్గెట్ చేస్తూ నికీషా చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చగా మారింది. సుశాంత్ అంత్యక్రియలకు బాలీవుడ్ ప్రముఖులెవరూ హాజరుకాకపోవడాన్ని నికీషా సూటిగా ప్రశ్నించారు.  నాది ఒకే ఒక్క ప్రశ్న. సుశాంత్ అంత్యక్రియలకు బాలీవుడ్ ప్రముఖులెవరూ ఎందుకు హాజరు కాలేదు..? లంచ్ చేస్తూ బిజీగా ఉన్నారా..? మానవత్వం ఎక్కడుంది..? అంటూ నికీషా ట్వీట్ చేశారు. నికీషా ట్వీట్‌కు నెటిజన్లు మరింత ఆజ్యం పోస్తున్నారు. తమదైన తరహాలో రియాక్ట్ అవుతున్నారు.