కేరళ గోల్డ్ స్కామ్లో మరో కీలక మలుపు.. చార్జ్షీట్లో కనిపించని సీఎం మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ పేరు
కేరళ గోల్డ్స్కామ్ మరో కీలక మలుపు తిరిగింది. బంగారం స్మగ్లింగ్ కేసులో ఎన్ఐఏ 20 మంది నిందితులపై చార్జ్షీట్ దాఖలు చేసింది. ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో ఈ చార్జ్షీట్ను దాఖలు చేశారు. గత ఏడాది జులైలో దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా చార్జ్షీట్ దాఖలయ్యింది. అయితే ఈ కేసులో...
Kerala Gold Smuggling : కేరళ గోల్డ్స్కామ్ మరో కీలక మలుపు తిరిగింది. బంగారం స్మగ్లింగ్ కేసులో ఎన్ఐఏ 20 మంది నిందితులపై చార్జ్షీట్ దాఖలు చేసింది. ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో ఈ చార్జ్షీట్ను దాఖలు చేశారు. గత ఏడాది జులైలో దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా చార్జ్షీట్ దాఖలయ్యింది. అయితే ఈ కేసులో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న సీఎం మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ శివశంకర్ పేరు మాత్రం చార్జ్షీట్లో లేదు. శివశంకర్ను ఈ కేసులో ఎన్ఐఏ ప్రశ్నించింది. సరిత్ , స్వప్న సురేశ్ , రమేశ్ , జలాల్ తదితరులు ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. నవంబర్ 2019 నుంచి జున్ 2020 మధ్య 167 కేజీల బంగారాన్ని దుబాయ్ నుంచి కేరళకు అక్రమంగా తరలించినట్టు అభియోగాలు నమోదయ్యాయి.
అంతేకాకుండా ప్రధాన నిందితులు దుబాయ్తో పాటు సౌదీఅరేబియా , మలేషియా , బహ్రేన్ దేశాల నుంచి కూడా బంగారాన్ని స్మగ్లింగ్ చేసేందుకు ప్రయత్నించినట్టు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. గత ఏడాది జులై 5న త్రివేండ్రం ఎయిర్పోర్ట్కు దుబాయ్ నుంచి వచ్చిన కార్గో విమానంలో 30 కేజీల బంగారం పట్టుబడింది. అప్పట్లో ఈ కేసు సంచలనం రేపింది. సాక్షాత్తూ సీఎం కార్యాలయం సిబ్బంది సాయంతోనే దుబాయ్ నుంచి త్రివేండ్రానికి బంగారం స్మగ్లింగ్ జరుగుతోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
స్మగ్లింగ్ కేసులో సూత్రధారిగా ఉన్న స్వప్న సురేశ్కు సీఎం మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ శివశంకర్ అండగా ఉన్నారని ఆరోపణలు వచ్చాయి. స్వప్న సురేశ్ను కేసు నుంచి తప్పించడానికి సీఎం కార్యాలయం నుంచి ఫోన్లు వచ్చాయని కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఈ కేసులో ఇప్పటికే స్వప్న సురేశ్ అప్రూవర్గా మారారు. అయితే స్వప్న సురేశ్ ఎవరో తనకు తెలియదని కేరళ సీఎం విజయన్ స్పష్టం చేశారు. కావాలనే లెఫ్ట్ సర్కార్ను బద్నామ్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.