#COVID19 తెలంగాణలో కొత్త భయం… ఒక్కరోజులో సీన్ మారింది

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కొత్త భయం పట్టుకుంది. సాక్షాత్తు ముఖ్యమంత్రి కేసీఆర్ పరిస్థితి అదుపులోనే వుందని, అంతా అనుకున్నట్లు సాగితే.. ఏప్రిల్ ఏడో తేదీ నాటికి రాష్ట్రంలో కరోనా నియంత్రణ సాధ్యమవుతుందని చెప్పిన రెండో రోజే సీన్ మారిపోయింది.

#COVID19 తెలంగాణలో కొత్త భయం... ఒక్కరోజులో సీన్ మారింది
Follow us

|

Updated on: Apr 01, 2020 | 2:09 PM

New fear among Telangana people: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కొత్త భయం పట్టుకుంది. సాక్షాత్తు ముఖ్యమంత్రి కేసీఆర్ పరిస్థితి అదుపులోనే వుందని, అంతా అనుకున్నట్లు సాగితే.. ఏప్రిల్ ఏడో తేదీ నాటికి రాష్ట్రంలో కరోనా నియంత్రణ సాధ్యమవుతుందని చెప్పిన రెండో రోజే సీన్ మారిపోయింది. దాంతో తెలంగాణ జనం మళ్ళీ బిక్కుబిక్కు మనే భయాందోళన మధ్య జీవనం సాగించడం మొదలైంది. దీనికి ఢిల్లీ సదస్సే కారణం కావడంతో అందుకు కారకులను, రహస్యంగా వైరస్ వ్యాప్తికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు తెలంగాణ ప్రజలు పలువురు.

తెలంగాణలో పరిస్థితి ఒక్కసారిగా పూర్తిగా మారిపోయింది. కరోనా వైరస్‌ అదుపులో ఉందనుకున్న పరిస్థితి నుంచి ఇప్పుడు మళ్ళీ బిక్కుబిక్కుమనే లెవెల్‌కు చేరుకుంది. ఢిల్లీ నిజాముద్దీన్‌లో నిర్వహించిన సదస్సు, దానికి హాజరైన వారి అనుమానాస్పద ప్రవర్తన ఇప్పుడు తెలంగాణవాసులను భయపెడుతున్నాయి. తెలంగాణ నుంచి వందలాది మంది ఢిల్లీ వెళ్లి వచ్చారన్న సమాచారం ఇప్పుడు స్థానికులకు ఆందోళన కలిగిస్తోంది.

మొన్నటి వరకు పరిస్థితి అదుపులోనే ఉందనే మాట తెలంగాణవాసులను ఊపిరి పీల్చుకునేలా చేసింది. ఈ మాట కూడా ఏకంగా ముఖ్యమంత్రి నోటి వెంట రావడంతో చాలా మంది ఊపిరి పీల్చుకున్నారు. కానీ తాజాగా రేగిన కలకలం ముచ్చెమటలు పట్టిస్తోంది. అక్కడికి వెళ్లి వచ్చినవారు ఎన్ని చోట్ల తిరిగారో? ఎంతమందితో సన్నిహితంగా మెలిగారో? అన్న భయాందోళన ఇప్పుడు చాలా మందిలో కలవరం రేపుతున్నాయి.

తెలంగాణ నుంచి వెయ్యికి మించి సదస్సుకు వెళ్లి ఉంటారని పోలీసులు అంచనా వేస్తూ ఉన్నారు. ఇప్పటికే కొంతమందిని అదుపులోకి తీసుకుని క్వారంటైన్‌కు తరలించారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ నుంచి ఆరు వందల మంది ఢిల్లీకి వెళ్లినట్టు పోలీసులకు పక్కా సమాచారం అందింది. ఇప్పటికే పరీక్షలు నిర్వహించగా 20 మందికి పాజిటివ్‌ అని తేలింది. మరో 74 మందికి వ్యాధి లక్షణాలు ఉన్నట్టు గుర్తించారు. రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఇప్పటి వరకు ఈ సంఖ్య 97కు చేరింది. వీరిలో 14 మంది కోలుకున్నారు. ఆరుగురు చనిపోయారు. ప్రస్తుతం వేరువేరు ఆసుపత్రులలలో 77 మంది చికిత్స పొందుతున్నారు.

నిజాముద్దీన్‌కు వెళ్లి వచ్చిన వాళ్లంతా గాంధీ ఆసుపత్రికి పరీక్షల కోసం రావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. ఇప్పటికే గుర్తించిన వారందరికీ ఆయా జిల్లాలలోని ఐసోలేషన్‌ కేంద్రాలకు తరలించారు. లక్షణాలు ఉన్నవారికి వెంటనే కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. వారి కుటుంబాలను కూడా క్వారంటైన్‌లో ఉంచారు. అన్ని కుటుంబాలకు ర్యాండమ్‌గా పరీక్షలు నిర్వహించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే.. ఢిల్లీ సదస్సుకు ఇంత మంది వెళితే.. రాష్ట్ర ఇంటెలిజెన్స్‌కు సమాచారం లేకపోవడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన వారు రహస్యంగా ఎందుకు గడిపారు… ఇన్ని పిలుపుల తర్వాత కూడా అందరూ ఎందుకు బయటికి రావడం లేదన్న అనుమానాలు పలువురిలో భయాందోళన పెంచుతున్నాయి. ప్రభుత్వం ఈ కోణంలోను దర్యాప్తు జరపాలని, ఇందులో కుట్ర కోణం వుంటే తగిన విధంగా శిక్షించాలని కోరుతున్నారు.

దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్ .. పూర్తిగా మారిపోయాడుగా!
ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్ .. పూర్తిగా మారిపోయాడుగా!
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..