ఢిల్లీ ఎన్నికలు: కాంగ్రెస్ స్టార్ క్యాంపైనర్ల జాబితా విడుదల!

70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి 8న ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ప్రచారం కోసం కాంగ్రెస్ పార్టీ 40 మందితో కూడిన స్టార్ క్యాంపైనర్ల జాబితా విడుదల చేసింది. కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, నవజ్యోత్ సింగ్ సిద్ధూ తదితరులు ఈ జాబితాలో ఉన్నారు. కాగా గతేడాది జూలైలో పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్‌‌పై అసంతృప్తి వ్యక్తం చేస్తూ తన మంత్రి పదవికి సిద్దూ రాజీనామా […]

ఢిల్లీ ఎన్నికలు: కాంగ్రెస్ స్టార్ క్యాంపైనర్ల జాబితా విడుదల!
Follow us

| Edited By:

Updated on: Jan 22, 2020 | 5:11 PM

70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి 8న ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ప్రచారం కోసం కాంగ్రెస్ పార్టీ 40 మందితో కూడిన స్టార్ క్యాంపైనర్ల జాబితా విడుదల చేసింది. కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, నవజ్యోత్ సింగ్ సిద్ధూ తదితరులు ఈ జాబితాలో ఉన్నారు. కాగా గతేడాది జూలైలో పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్‌‌పై అసంతృప్తి వ్యక్తం చేస్తూ తన మంత్రి పదవికి సిద్దూ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బహిరంగ కార్యక్రమాల్లో ఎక్కడా కనిపించని సిద్ధూను కాంగ్రెస్ అధిష్టానం మళ్లీ తెరమీదికి తీసుకురావడం గమనార్హం. ఇక గతేడాది బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రముఖ నటుడు శత్రుఘ్న సిన్హా కూడా కాంగ్రెస్ స్టార్ క్యాంపైనర్‌గా వ్యవహరించనున్నారు.

ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన నామినేషన్ దాఖలు చేసిన ఒక రోజు తర్వాత కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపైనర్ల జాబితా విడుదల చేయడం గమనార్హం. స్టార్ క్యాంపైనర్ల జాబితాలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కెప్టెన్ అమరీందర్ సింగ్ (పంజాబ్), అశోక్ గెహ్లాట్ (రాజస్థాన్), కమల్‌నాథ్ (మధ్య ప్రదేశ్), భూపేశ్ బాఘెల్ (చత్తీస్‌గఢ్), వి. నారాయణ స్వామి (పుదుచ్చేరి) కూడా ఉన్నారు. రాజస్థాన్ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ కూడా ఢిల్లీ ఎన్నికల్లో ప్రచారం చేయనున్నారు. ఫిబ్రవరి 11న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

[svt-event date=”22/01/2020,5:02PM” class=”svt-cd-green” ]

[/svt-event]

తెలంగాణ పదో తరగతి ఫలితాల విడుదల తేదీ ఇదే
తెలంగాణ పదో తరగతి ఫలితాల విడుదల తేదీ ఇదే
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్