Hidden Treasures : గుప్త నిధుల ఆశ..గుడిలో ఎంపీటీసీ తవ్వకాలు..చివరకు
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్ పేట్ మండలం పోతేపల్లి అభయాంజనేయ స్వామి దేవాలయంలో గుప్త నిధుల తవ్వకాలు కలకలం సృష్టించాయి.
Hidden Treasures : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్ పేట్ మండలం పోతేపల్లి అభయాంజనేయ స్వామి దేవాలయంలో గుప్త నిధుల తవ్వకాలు కలకలం సృష్టించాయి. సోమవారం రాత్రి 10 గంటల సమయంలో 8 మంది సభ్యులు గల ముఠా గుడిలో తవ్వకాలు జరపడం స్థానికుల కంటపడింది. దీంతో వారు 100కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. అయితే పోలీసులు ఎంతసేపటికి రాకపోవడంతో..గ్రామస్థులే వెళ్లి ఆ గ్యాంగ్ను తాళ్లతో బంధించారు.
మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు స్థానిక ఎస్సై అక్కడికి చేరుకున్నారు. దీంతో నిందితులను..స్థానికులు పోలీసులకు అప్పగించారు. అయితే ఈ గ్యాంగ్లో కాగజ్నగర్ మండలంలోని రామ్నగర్కి చెందిన ఎంపీటీసీ బికాస్ ఘరామి ఉన్నట్లు పోలీసులు నిర్దారించారు. అతనితో పాటు ఈస్గాం ప్రాంతానికి చెందిన ఐదుగురిని, మధ్యప్రదేశ్కు చెందిన ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 22 వేల నగదుతో పాటు 8 సెల్ ఫోన్లు, కారు, బైక్ స్వాధీనం చేసుకున్నారు.
ఇది కూడా చదవండి : “రెండేళ్లుగా పెన్షన్ లేదయ్యా”..చలించిపోయిన కలెక్టర్..