Crime News : నిజామాబాద్ జిల్లా చందూరు మండలంలో దారుణం.. తల్లీ, కుమారుడిని దారుణంగా చంపి..
నిజామాబాద్ జిల్లా చందూరు మండలం ఘన్పూర్ అటవీ ప్రాంతంలో కలకలం చెలరేగింది. తల్లి, కుమారుడి డెడ్బాడీలను ఆదివారం పోలీసులు గుర్తించారు. అక్రమ సంబంధం నేపథ్యంలో...
నిజామాబాద్ జిల్లా చందూరు మండలం ఘన్పూర్ అటవీ ప్రాంతంలో కలకలం చెలరేగింది. తల్లి, కుమారుడి డెడ్బాడీలను ఆదివారం పోలీసులు గుర్తించారు. అక్రమ సంబంధం నేపథ్యంలో ఈ హత్యలు జరిగినట్లు అనుమానిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మూడు రోజుల క్రితం ఘన్పూర్కు చెందిన చెవిటి రాము… వర్ని మండలం ఉమ్నాపూర్ గ్రామానికి చెందిన సుజాత(30), ఆమె ఏడాదిన్నర తనయుడిని కట్టెల కోసం ఘన్పూర్ గుట్టకు తీసుకెళ్లాడు. అదే రోజు వాళ్లిద్దరినీ హత్య చేశాడు. అనంతరం అక్కడే పాతిపెట్టాడు.
ఆదివారం చెవిటి రాము వర్ని పీఎస్కు వచ్చి నేర చేసినట్లు అంగీకరించి లొంగిపోయాడు. దీంతో పోలీసులు స్పాట్కు చేరుకుని డెడ్బాడీలను పరిశీలించారు. అక్రమ సంబంధం నేపథ్యంలో ఈ హత్యలు జరిగినట్లు ప్రచారం జరుగుతున్నా..పోలీసులు ఇంకా పూర్తి వివరాలు వెల్లడించలేదు. కేసుపై నిందితుడి విచారణ కొనసాగుతోంది.
Also Read :
TSRTC : సంక్రాంతి పండుగ వేళ ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్.. ఇంటి వద్దకే బస్సు సర్వీసులు
Tragedy : పగవాడికి కూడా ఇంత కష్టం రాకూడదు..కుటుంబం మొత్తాన్ని వెంటాడిన మృత్యువు..మరీ ఇలానా..?