ఏపీలో కరోనా వైద్య సేవలకు.. 11,200 మంది..!
దేశంలో కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ మహమ్మారి కట్టడికోసం ప్రభుత్వాలు పలు చర్యలు చేపడుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలోని కరోనా ఆస్పత్రుల్లో వైద్యం, ఇతర సంబంధిత సేవల కోసం
దేశంలో కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ మహమ్మారి కట్టడికోసం ప్రభుత్వాలు పలు చర్యలు చేపడుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలోని కరోనా ఆస్పత్రుల్లో వైద్యం, ఇతర సంబంధిత సేవల కోసం 11,200 మంది సిబ్బందిని నియమిస్తున్నామని సీఎం వైఎస్ జగన్కు అధికారులు తెలిపారు. కరోనా నివారణపై క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సీఎం సమీక్షలో అధికారులు వెల్లడించిన అంశాలిలా ఉన్నాయి.
కరోనావైరస్ నివారణ చర్యలను అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తున్నామని, పెద్ద సంఖ్యలో పరీక్షలు చేస్తున్నామని అధికారులు తెలిపారు. పాజిటివ్గా వచ్చిన కేసులను ప్రకటిస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్ ఆసుపత్రుల్లో 37,189 బెడ్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 16,404. ఆక్సిజన్, వెంటిలేటర్ తరహా చికిత్స పొందుతున్న వారు 4,965 మంది ఉన్నారని ప్రకటించారు. మరణాల రేటు దేశంలో 2.07 శాతం ఉంటే అదే ఏపీలో 0.89 శాతమే. అదే కర్ణాటకలో 1.85 శాతం, తమిళనాడులో 1.63, మహారాష్ట్రలో 3.52 శాతంగా ఉందని సీఎంకు వివరించారు.
Read More:
ఏపీలోని ఆ జిల్లాల్లో.. మరోసారి కఠిన లాక్డౌన్..?
జగన్ కీలక నిర్ణయం.. సామాజిక ఆసుపత్రుల్లోనూ ఆక్సిజన్ బెడ్స్..!