మోదీ ధ్యాన గుహ ప్రత్యేకత!
ప్రస్తుతం దేశంలో హాట్ టాపిక్ గా మారిన రుద్ర మెడిటేషన్ గుహ. ఎందుకంటే ఈ మధ్యన ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత గత శనివారం ప్రధాని నరేంద్ర మోడీ కేదార్నాత్ వెళ్ళిన సందర్భంగా ఆ గుహలో ధ్యానం చేశారు. దాంతో ఈ గుహ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది. గతంలో ఓసారి మోడీ కేదార్నాథ్లో స్వామిని దర్శించుకున్నాక ధ్యానం చేసుకునేందుకు ఓ గుహ ఉంటే బాగుంటుందని అక్కడి నిర్వాహకులకు చెప్పారట. దీంతో వారు ఆ గుహను […]
ప్రస్తుతం దేశంలో హాట్ టాపిక్ గా మారిన రుద్ర మెడిటేషన్ గుహ. ఎందుకంటే ఈ మధ్యన ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత గత శనివారం ప్రధాని నరేంద్ర మోడీ కేదార్నాత్ వెళ్ళిన సందర్భంగా ఆ గుహలో ధ్యానం చేశారు. దాంతో ఈ గుహ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది. గతంలో ఓసారి మోడీ కేదార్నాథ్లో స్వామిని దర్శించుకున్నాక ధ్యానం చేసుకునేందుకు ఓ గుహ ఉంటే బాగుంటుందని అక్కడి నిర్వాహకులకు చెప్పారట. దీంతో వారు ఆ గుహను నిర్మించారట. ఈ క్రమంలోనే మోడీ ఆ గుహలో ఇప్పుడు ధ్యానం చేయడంతో అందరూ దాని గురించి చర్చించుకుంటున్నారు. ఈ గుహలో సెలబ్రెటీలు మాత్రమే కాదు మీరు కూడా ధ్యానం చేసుకునే సదా అవకాశం కల్పిస్తున్నారు అక్కడి గుహ నిర్వాహకులు. ఇక్కడ మీరు ఒంటరిగా ఎన్ని రోజులైనా ధ్యానం చేసుకోవచ్చు. అదెలాగా? అయితే ఆ ధ్యాన గుహ విశేషాలేంటి, అది ఎక్కడ ఉంది. బుకింగ్ చేసుకోవడం ఎలాగో మేము ఇక్కడ తెలుపుతున్నాము.
2018లో దాన్ని నిర్మించారు. 12250 అడుగుల ఎత్తులో దీనిని నిర్మించారు. అందులో భక్తులు ధ్యానం, పూజలు చేసుకోవచ్చు. కాగా ఈ గుహ గడ్వాల్ మండల్ వికాస్ నిగమ్కు చెందిన టూరిజం ప్రాపర్టీగా ఉంది. ఈ క్రమంలో మొదట్లో ఒక్క రోజుకు ఒక్కరికి ఈ గుహలో ఉండేందుకు రూ.3వేల ఫీజు వసూలు చేసేవారు. కానీ అప్పట్లో ఆ గుహపై ఎవరూ అంతగా ఆసక్తి చూపించలేదు. దీంతో రోజువారీ రుసుంను రూ.990కి తగ్గించారు. ధ్యానంతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణ కోసం నిర్మించిన ఈ గుహలో అన్ని సదుపాయాలు ఉన్నాయి. టాయిలెట్, విద్యుత్, టెలిఫోన్ తదితర ఆధునిక సదుపాయాలు సమకూర్చారు. గత ఏడాది కేదార్నాథ్ ను 7,32,000 మంది యాత్రికులు దర్శించుకున్నారు. మోదీ వల్ల ఇప్పుడీ గుహ ఏంతో ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది.