పబ్​జీ ఆడేందుకు ఫోన్​ ఇవ్వలేదని బ్లేడ్​తో గొంతు కోసుకున్నాడు

చ‌దువు లేదు, కాసేపు త‌ల్లిదండ్రులతో కూర్చోని మాట్లాడుకోవ‌డం లేదు. ఓన్లీ ప‌బ్‌జీ. అవును ఇప్పుడు పిల్ల‌లు, యువ‌త ప‌బ్‌జీ గేమ్‌కు బానిసలైపోతున్నాయి.

పబ్​జీ ఆడేందుకు ఫోన్​ ఇవ్వలేదని బ్లేడ్​తో గొంతు కోసుకున్నాడు
Follow us

|

Updated on: Aug 17, 2020 | 8:04 AM

చ‌దువు లేదు, కాసేపు త‌ల్లిదండ్రులతో కూర్చోని మాట్లాడుకోవ‌డం లేదు. ఓన్లీ ప‌బ్‌జీ. అవును ఇప్పుడు పిల్ల‌లు, యువ‌త ప‌బ్‌జీ గేమ్‌కు బానిసలైపోతున్నాయి. ముఖ్యంగా టీనేజ్ యూత్ తమ అమూల్య‌మైన స‌మ‌యాన్ని ఈ ఉప‌యోగం లేని గేమ్ కోసం వెచ్చిస్తోంది. ఆ గేమ్ ఆడొద్ద‌ని మందలిస్తే వారు సైకోలుగా మారిపోతున్నారు. ఎదిటివారిపై దాడి చేయ‌డం, త‌మ ప్రాణాలే తీసుకోవ‌డం వంటి ప‌నులు చేస్తున్నారు. తాజాగా అనంతపురం జిల్లా గుత్తి మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో ఇటువంటి ఘ‌ట‌నే జ‌రిగింది.

పబ్​జీ గేమ్​ ఆడేందుకు ఫోన్​ ఇవ్వలేదని ఓ బాలుడు బ్లేడ్​తో గొంతు కోసుకుని సూసైడ్ చేసుకోవ‌డానికి ప్ర‌యత్నించాడు. ఫ్యామిలీ మెంబ‌ర్స్ వెంటనే బాలుణ్ని చికిత్స నిమిత్తం గుత్తి గ‌వ‌ర్న‌మెంట‌ట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం జిల్లా కేంద్రానికి తరలించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read : పెరిగిన‌ వరద ఉదృతి : క‌డెం ప్రాజెక్ట్ 5 గేట్లు ఎత్తివేత‌