Krishna River Board: ఏపీ ప్రభుత్వం కుట్ర చేస్తోంది.. కృష్ణా బోర్డును వైజాగ్కు తరలించడంపై మంత్రి నిరంజన్ ఫైర్..
Krishna River Board: కృష్ణా బోర్డును వైజాగ్కు తరలించడంపై తెలంగాణ మంత్రి నిరంజన్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆసంతృప్తి వ్యక్తం చేశారు.
Krishna River Board: కృష్ణా బోర్డును వైజాగ్కు తరలించడంపై తెలంగాణ మంత్రి నిరంజన్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆసంతృప్తి వ్యక్తం చేశారు. కృష్ణా బోర్డును తరలించాడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. బుధవారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. తెలంగాణ ప్రజలు, అధికారులు కృష్ణా బోర్డును కలవాలంటే విశాఖపట్నం వరకు వెళ్లడం కష్టతరం అని పేర్కొన్నారు. కృష్ణా నదీ పరివాహక ప్రాంతం నుంచి వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న వైజాగ్లో కృష్ణా యాజామాన్య బోర్డు పెట్టడం ఏంటి? అని మంత్రి నిరంజన్ ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వం కృష్ణా బోర్డును తమ నియంత్రణలో ఉంచుకునే ప్రయత్నం చేస్తోందని ఆయన ఆరోపించారు. ఏపీకి కృష్ణా బోర్డును తరలించాలనుకుంటే విజయవాడ, కర్నూలు, గుంటూరులో ఎక్కడైనా పెట్టుకోవచ్చునని అన్నారు.
ఇదే సమయంలో రాయలసీమ ఎత్తిపోతల పథకంపైనా తీవ్రంగా స్పందించారు. 20 ఏళ్ల క్రితం మొదలు పెట్టిన కుట్ర ఫలితమే ఇప్పటి రాయలసీమ ఎత్తిపోతల పథకం అని వ్యాఖ్యానించారు. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచుతున్నప్పుడే తాము ఈ విషయంపై నిరసన వ్యక్తం చేశామని నిరంజన్ రెడ్డి గుర్తు చేశారు. కానీ అప్పటి తెలంగాణ కాంగ్రెస్ నేతలు తమతో కలిసి రాలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ కొత్త పథకం కాబట్టి డీపీఆర్ అడిగిందని, కానీ ఏపీ మాత్రం డీపీఐ అంటోందని మంత్రి నిరంజన్ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ పనులను ఆపాలని కూడా ఆదేశించిందని ఆయన గుర్తు చేశారు. కానీ ఏపీ ఆ ఆదేశాలను బేఖాతరు చేస్తోందన్నారు. కేంద్రం ఆదేశాలను లెక్క చేయకుండా పనులు కొనసాగించడం ఏపీ విజ్ఞతకే వదిలేస్తున్నామని మంత్రి వ్యాఖ్యానించారు.
Also read:
Central Govt: జంపన్నవాగుపై కాజ్వే నిర్మాణం.. అనుమతులు మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వం..
MLC By-Elections: ఏపీలో ఎమ్మెల్సీ బై-ఎలక్షన్కు షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలివే..