పోలవరం కేంద్రంగా టగ్ ఆఫ్ వార్ : బాబుకు మంత్రి అనిల్ భారీ కౌంటర్స్ !
పోలవరం కేంద్రంగా టగ్ ఆఫ్ వార్ నడుస్తోంది. అధికార.. ప్రతిపక్షాల మధ్య మాటలు తూటాల్లా పేలుతున్నాయి. ప్రతిపక్ష నేత కామెంట్స్కు దీటుగా బదులిస్తోంది వైసీపీ శిబిరం.
పోలవరం కేంద్రంగా టగ్ ఆఫ్ వార్ నడుస్తోంది. అధికార.. ప్రతిపక్షాల మధ్య మాటలు తూటాల్లా పేలుతున్నాయి. ప్రతిపక్ష నేత కామెంట్స్కు దీటుగా బదులిస్తోంది వైసీపీ శిబిరం. పోలవరంపై టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యలకు తాజాగా స్ట్రాంగ్ కౌంటరిచ్చారు మంత్రి అనిల్కుమార్. పోలవరం ఎత్తు అంగుళం కూడా తగ్గించబోమని.. కావాలంటే టేప్ తెచ్చుకొని కొలుచుకోవాలంటూ సవాల్ విసిరారు. పోలవరం గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు ఎక్కడిదని ప్రశ్నించారు మంత్రి. ప్యాకేజీల కోసమే ప్రాజెక్ట్ కడతామని కేంద్రాన్ని చంద్రబాబు ప్రభుత్వం ఒప్పించిందని విమర్శించారు. రూ. 55 వేల కోట్ల రూపాయలకు కేంద్రాన్ని ఒప్పించామని చెబుతున్న చంద్రబాబు.. 2017 క్యాబినెట్ నిర్ణయాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
నాటి వైఎస్ టైంలో పోలవరానికి అన్ని అనుమతులు వచ్చాయన్న మంత్రి.. జగన్ దీనిని పూర్తి చేస్తారని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది చివరి కల్లా పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తామన్నారు. పునరావాసం గురించి ఎప్పుడూ మాట్లాడని మాజీ సీఎం చంద్రబాబు.. ఇప్పుడు ఇష్టారీతిన కామెంట్స్ చేస్తున్నారని మండిపడ్డారు. మార్చిలో 20 వేల మందికి పునరావాసం కల్పించబోతున్నామన్న మంత్రి దశలవారీగా అందరికీ న్యాయం చేస్తామన్నారు.
Also Read :
జగిత్యాల : పాడుబడ్డ ఇంట్లో కుళ్లిన స్థితిలో యువతీ, యువకుల మృతదేహాలు..ప్రేమ జంటేనా..? లేక !
ఒక్క రూపాయికే క్వార్టర్ మద్యం..అభిమాన దర్శకుడి పెళ్లి రోజు సందర్భంగా