మళ్లీ ఆస్పత్రిలో చేరిన గోవా ముఖ్యమంత్రి పారికర్‌

పనాజీ : గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్‌ శనివారం రాత్రి మళ్లీ ఆస్పత్రిలో చేరారు. ఆయన అప్పర్ జీఐ ఎండోస్కోపీ కోసమే గోవా మెడికల్ కాలేజీ హాస్పిటల్ లో చేరారని సీఎం కార్యాలయం తెలిపింది. ఒక రోజంతా ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉంటారని పేర్కొంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. సీఎం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని.. ప్రస్తుతం అబ్జర్వేషన్లో ఉన్నారని గోవా ఆరోగ్య శాఖ […]

మళ్లీ ఆస్పత్రిలో చేరిన గోవా ముఖ్యమంత్రి పారికర్‌
Follow us

| Edited By: Srinu

Updated on: Mar 07, 2019 | 5:00 PM

పనాజీ : గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్‌ శనివారం రాత్రి మళ్లీ ఆస్పత్రిలో చేరారు. ఆయన అప్పర్ జీఐ ఎండోస్కోపీ కోసమే గోవా మెడికల్ కాలేజీ హాస్పిటల్ లో చేరారని సీఎం కార్యాలయం తెలిపింది. ఒక రోజంతా ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉంటారని పేర్కొంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. సీఎం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని.. ప్రస్తుతం అబ్జర్వేషన్లో ఉన్నారని గోవా ఆరోగ్య శాఖ మంత్రి విశ్వజీత్ రాణె తెలిపారు. పారికర్ ఓ ఫైటర్ అని.. ఇవాళ సాయంత్రం తిరిగి ఇంటికి వెళ్లారని మంత్రి అన్నారు.