బంపర్ ఆఫర్: బగ్ను కనిపెట్టండి.. లక్షలు పట్టండి..
ప్రముఖ సాఫ్ట్ వేర్ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. మైక్రోసాఫ్ట్ ప్రవేశపెడుతున్న తన క్రోమియం ఎడ్జ్ బ్రౌజర్లో తప్పులను లేదా బగ్స్ను పసిగట్టగలిగితే భారీ మొత్తంలో మనీ గెలుచుకునే అవకాశం కల్పిస్తోంది. మైక్రోసాఫ్ట్ సంస్థ త్వరలో ఎడ్డ్ బ్రౌజర్ను ప్రవేశపెట్టనుంది. అయితే చాలా ఏళ్ల క్రితమే దీన్ని ప్రవేశపెట్టాల్సినప్పటికీ మొజిల్లా ఫైర్ ఫాక్స్, గూగుల్ బ్రౌజర్లు అప్పటికే తమ సత్తా చాటాయి. అయితే తాజాగా ఎడ్జ్ బ్రౌజర్ను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసి […]
ప్రముఖ సాఫ్ట్ వేర్ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. మైక్రోసాఫ్ట్ ప్రవేశపెడుతున్న తన క్రోమియం ఎడ్జ్ బ్రౌజర్లో తప్పులను లేదా బగ్స్ను పసిగట్టగలిగితే భారీ మొత్తంలో మనీ గెలుచుకునే అవకాశం కల్పిస్తోంది. మైక్రోసాఫ్ట్ సంస్థ త్వరలో ఎడ్డ్ బ్రౌజర్ను ప్రవేశపెట్టనుంది. అయితే చాలా ఏళ్ల క్రితమే దీన్ని ప్రవేశపెట్టాల్సినప్పటికీ మొజిల్లా ఫైర్ ఫాక్స్, గూగుల్ బ్రౌజర్లు అప్పటికే తమ సత్తా చాటాయి. అయితే తాజాగా ఎడ్జ్ బ్రౌజర్ను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసి అందులో దాగి వున్న బగ్స్ ను కనిపెట్టాలంటూ ఔత్సాహికులకు ఆఫర్ ప్రకటించింది మైక్రోసాఫ్ట్. దీనిని కనిపెట్టిన వారికి రూ. 21 లక్షలు బహుమతిగా ఇవ్వనున్నట్లు తెలిపింది. అయితే కనిపెట్టిన బగ్ ఎంతస్థాయిలో ప్రమాదం సృష్టించగలదో అనే దానిపై ప్రైజ్ మనీ రూ. 72,200 నుంచి రూ. 21 లక్షలు ఉంటుందని తెలిపింది. ఇక సాఫ్ట్వేర్లో లోపాలను కనిపెట్టేవారికి కూడా ప్రైజ్ మనీ ఆఫర్ చేసింది. అయితే క్రోమియం ఎడ్జ్ బ్రౌజర్లోని బగ్స్ను కనుగొని ఎమ్ఎస్ఆర్సీ రీసెర్చ్ పోర్టల్లోకి వెళ్లి బగన్ సబ్మిషన్ గైడ్లైన్స్ చదివి అక్కడే పోస్టు చేయాల్సి ఉంటుంది.