స్కూల్ గోడ దూకి మరీ చిట్టీలు.. ఇవేనా ప్రతిభకు సూచికలు!
విద్యార్థుల భవిష్యత్కు 10వ తరగతి పరీక్షలు ఎంతో ప్రధానమైనవి. చాలామంది రేపటి గురించి కోటి ఆశలతో ఈ ఎగ్జామ్స్ కోసం సన్నద్దం అవుతూ ఉంటారు. అలాంటి పరీక్షలలో స్వశక్తితో ఎగ్జామ్స్ రాయాల్సిన అభ్యర్థులకు.. కొంతమంది స్కూల్ ప్రహరీగోడ దూకి మరీ చిట్టీలు అందించడం తీవ్ర చర్చనీయాంశమైంది. మహారాష్ట్ర.. యావత్మాల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద ఈ దృశ్యాలు కనిపించడంతో కొంతమంది మొబైల్లో చిత్రీకరించారు. ఇప్పుడు అవి కాస్తా వైరల్గా మారాయి. దీనిపై పరీక్షా కేంద్రం నియంత్రణ […]
విద్యార్థుల భవిష్యత్కు 10వ తరగతి పరీక్షలు ఎంతో ప్రధానమైనవి. చాలామంది రేపటి గురించి కోటి ఆశలతో ఈ ఎగ్జామ్స్ కోసం సన్నద్దం అవుతూ ఉంటారు. అలాంటి పరీక్షలలో స్వశక్తితో ఎగ్జామ్స్ రాయాల్సిన అభ్యర్థులకు.. కొంతమంది స్కూల్ ప్రహరీగోడ దూకి మరీ చిట్టీలు అందించడం తీవ్ర చర్చనీయాంశమైంది. మహారాష్ట్ర.. యావత్మాల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద ఈ దృశ్యాలు కనిపించడంతో కొంతమంది మొబైల్లో చిత్రీకరించారు. ఇప్పుడు అవి కాస్తా వైరల్గా మారాయి.
దీనిపై పరీక్షా కేంద్రం నియంత్రణ అధికారి ఏఎస్ చౌదరి స్పందించారు. పాఠశాల ప్రహారీ గోడ సక్రమంగా లేకపోవడంతో, ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని చెప్పారు. దీనిపై పోలీసులకు కూడా కంప్లైంట్ ఇచ్చామని, ఇంకోసారి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని, పరీక్షలు సంక్రమంగా నిర్వహిస్తామని తెలిపారు.
#WATCH Maharashtra: People seen climbing the boundary walls and providing chits to students, writing their class X Matriculation examination at Zila Parishad School, Mahagaon in Yavatmal district. (03.03.2020) pic.twitter.com/IqwC4tdhLQ
— ANI (@ANI) March 3, 2020