పంతంగి టోల్ప్లాజా వద్ద భారీగా పట్టుబడిన గంజాయి
విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై ఉన్న పంతంగి టోల్ప్లాజా వద్ద డీఆర్ఐ అధికారులు తనిఖీలు నిర్వహించారు. గంజాయి లోడ్తో వస్తున్న ట్రక్కును గుర్తించి తనిఖీలు చేపట్టారు...
అక్రమ దందాలపై తెలంగాణ సర్కార్ ఉక్కుపాదం మోపుతోంది. డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల రవాణపై తెలంగాణ పోలీసులు ప్రత్యేక దృష్టిసారించారు. గత కొద్ది రోజులుగా హైదరాబాద్ మీదుగా ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్తున్నస్తున్న గంజాయి గ్యాంగ్స్ను పట్టుకుంటున్నారు. తాజాగా.. ఏపీలోని పశ్చిమ గోదావరి నుంచి ఉత్తరప్రదేశ్కు పెద్దమొత్తంలో తరలిస్తున్న గంజాయిని డీఆర్ఐ అధికారులు పంతంగి టోల్ప్లాజా వద్ద పట్టుకున్నారు.
విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై ఉన్న పంతంగి టోల్ప్లాజా వద్ద డీఆర్ఐ అధికారులు తనిఖీలు నిర్వహించారు. గంజాయి లోడ్తో వస్తున్న ట్రక్కును గుర్తించి తనిఖీలు చేపట్టారు. డ్రైవర్ క్యాబిన్ వెనుక ఏర్పాటు చేసిన ప్రత్యేక అరలో గంజాయి ప్యాకెట్లను గుర్తించారు. మొత్తం 1427 కిలోల గంజాయి పట్టుబడింది. దీని విలువ రూ. 3.56 కోట్లుగా సమాచారం. గంజాయి తరలిస్తున్న వ్యక్తితో పాటు ట్రక్కును స్వాధీనం చేసుకున్నారు.