అక్కడ అడుగుపెట్టాలంటే.. ఈ-రిజిస్ట్రేషన్ తప్పనిసరి..
దేశంలో కరోనా కేసులు రోజురోజుకు భారీగా నమోదవుతున్నాయి. ఇప్పటికే 7లక్షల వరకు కరోనా బాధితులను దేశవ్యాప్తంగా గుర్తించారు. ఈ క్రమంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారికి పంజాబ్ ప్రభుత్వం కొత్త నిబంధన
దేశంలో కరోనా కేసులు రోజురోజుకు భారీగా నమోదవుతున్నాయి. ఇప్పటికే 7లక్షల వరకు కరోనా బాధితులను దేశవ్యాప్తంగా గుర్తించారు. ఈ క్రమంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారికి పంజాబ్ ప్రభుత్వం కొత్త నిబంధన విధించింది. తమ రాష్ట్రానికి వచ్చేవారు ఇకనుంచి కచ్చితంగా ఈ-రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించింది. రిజిస్ట్రేషన్ లేనివారిని రాష్ట్రంలోకి ఎట్టిపరిస్థితుల్లో అనుమతించేది లేదని స్పష్టం చేసింది.
కోవిద్-19 కట్టడికి పంజాబ్ ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. కాగా.. ఈ నిబంధన నేటి అర్థరాత్రినుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ వెబ్సైట్లో కానీ, కోవా పంజాబ్ అనే మొబైల్ అప్లికేషన్లో కానీ ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకుని, దానిని సంబంధించిన కాపీని ప్రింట్ తీసుకుని వెంట తీసుకురావాలని సూచించింది. ఈ-రిజిస్ట్రేషన్ చేసుకుని రాష్ట్రంలోకి వచ్చినప్పటికీ వారంతా కచ్చితంగా 14 రోజుల పాటు హోం క్వారంటైన్ ఉండాల్సిందేనని ప్రభుత్వం స్పష్టం చేసింది.
Also Read: కర్ణాటకలో అడవుల్లో ‘బగీరా’.. వైరల్ అవుతున్న ఫోటోలు..