Accident: కృష్ణా జిల్లాలో దారుణం.. రైలెక్కి సెల్ఫీ తీసుకోబోయిన యువకుడు.. అంతలోనే..
Accident: కృష్ణా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. సెల్ఫీకోసం ప్రయత్నించి ఓ యువకుడు ప్రాణాలమీదకు తెచ్చుకున్నాడు. అధికారులు తెలిపిన..
Accident: కృష్ణా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. సెల్ఫీకోసం ప్రయత్నించి ఓ యువకుడు ప్రాణాలమీదకు తెచ్చుకున్నాడు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణా జిల్లాలోనఇ జగ్గయ్య పేట విద్యానగర్ వద్ద ఓ యువకుడు గూడ్స్ ట్రైన్ ఎక్కి సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించాడు. అయితే యువకుడు తన ఫోన్తో సెల్ఫీ తీసుకుంటుండగా హైటెన్షన్ వైర్లు తగిలి తీవ్ర గాయాలపాలయ్యాడు. ఇది గమనించిన అధకారులు గాయాలపాలైన యువకుడిని జగ్గయ్యపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. యువకుడిని పరీక్షించిన వైద్యులు, అతని పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also read:
GHMC Mayor Election: గ్రేటర్ మేయర్, డిప్యూటీ మేయర్లకు శుభాకాంక్షలు తెలిపిన అసదుద్దీన్ ఓవైసీ
Robot Fish: చేపల్లాంటి చేపలు.. కానీ ఇవి ‘రోబోలు”.. నీటి అడుగున ఇవి ఏం చేస్తాయో తెలుసా..