రాజన్న స్మరణలో దీదీ
హైదరాబాద్ : ఏపీ మాజీ సీఎం, దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి 70వ జయంతిని పురస్కరించుకుని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నివాళులర్పించారు. ఈ మేరకు ఆమె ట్విటర్లో ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ జయంతిని సందర్భంగా ఆయనకు నివాళులర్పిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ ట్వీట్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆమె ట్యాగ్ చేశారు. ఇక వైఎస్సార్ జయంతి రోజును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతు దినోత్సవంగా ప్రకటించిన విషయం […]
హైదరాబాద్ : ఏపీ మాజీ సీఎం, దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి 70వ జయంతిని పురస్కరించుకుని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నివాళులర్పించారు. ఈ మేరకు ఆమె ట్విటర్లో ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ జయంతిని సందర్భంగా ఆయనకు నివాళులర్పిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ ట్వీట్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆమె ట్యాగ్ చేశారు.
ఇక వైఎస్సార్ జయంతి రోజును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతు దినోత్సవంగా ప్రకటించిన విషయం తెలిసిందే. పలువురు నాయకులతోపాటు వైస్సార్ అభిమానులు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.
Tribute to YS Rajasekhara Reddy, former chief minister of Andhra Pradesh, on his birth anniversary @ysjagan
অন্ধ্র প্রদেশের প্রাক্তন মুখ্যমন্ত্রী ওয়াই এস রাজশেখর রেড্ডির জন্মবার্ষিকীতে শ্রদ্ধার্ঘ্য
— Mamata Banerjee (@MamataOfficial) July 8, 2019