అంధత్వ నిర్మూలనకు అద్వితీయ కృషి..ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్కు ‘ది గ్రీన్బర్గ్ ప్రైజ్ 2020’ అవార్డు
అంధత్వాన్ని తొలగించడానికి అద్వితీయ కృషి చేస్తోన్నఎల్ వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్కు ప్రతిష్టాత్మక ‘ది గ్రీన్బర్గ్ ప్రైజ్ - ఎండ్ బ్లైండ్నెస్ 2020’ అవార్డు దక్కింది.
అంధత్వాన్ని తొలగించడానికి అద్వితీయ కృషి చేస్తోన్న ఎల్ వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్కు ప్రతిష్టాత్మక ‘ది గ్రీన్బర్గ్ ప్రైజ్ – ఎండ్ బ్లైండ్నెస్ 2020’ అవార్డు దక్కింది. ఎల్ వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ గుల్లపల్లి ఎన్ రావుకు ఈ అవార్డును ‘అవుట్స్టాండింగ్ అచీవ్మెంట్ ప్రైజ్’ విభాగంలో అందుకుంటున్నారు. ‘ఎండ్ బ్లైండ్నెస్’ అనేది తన 19 సంవత్సరాల వయస్సులో కళ్ళు కోల్పోయిన డాక్టర్ శాన్ఫోర్డ్ గ్రీన్బెర్గ్, అతని భార్య సుసాన్ అంధత్వాన్ని నిర్మూలించేందుకు తీసుకొచ్చిన ఉద్యమం. డాక్టర్ గ్రీన్బర్గ్ జాన్స్… హాప్కిన్స్ యూనివర్సిటీ బోర్డు గవర్నర్ల చైర్మన్గా ఉన్నప్పుడు 2012 లో, అంధత్వాన్ని అంతం చేసే పోరాటంలో ముందున్న శాస్త్రీయ, వైద్య సంఘాల కృషిని గుర్తించడానికి ఈ అవార్డును ప్రకటించారు.
“ఎల్ వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ యొక్క 3000లకు పైగా కుటుంబాలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేకమంది మద్దతుదారుల తరపున ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకోబోతున్నందకు గర్వంగా ఉంది. 2020 నాటికి అంధత్వాన్ని నిర్మూలించడం అనేది రెండు దశాబ్దాలుగా గ్లోబల్ ఐకేర్ కమ్యూనిటీ కంటోన్న కల. ఈ ప్రయత్నానికి మా సహకారాన్ని గుర్తించినందుకు శాన్ఫోర్డ్, సుసాన్ గ్రీన్బెర్గ్ ఎండ్ బ్లైండ్నెస్ ఫౌండేషన్కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మిగతా విజేతలందరికీ నా హృదయపూర్వక అభినందనలు ”అని ఎల్ వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ వ్యవస్థాపక చైర్మన్ గుల్లపల్లి ఎన్ రావు పేర్కొన్నారు.
సైంటిఫిక్, మెడికల్ కమ్యూనిటిస్ నుంచి అంధత్వాన్ని నిర్మూలించేందుకు అవిరళ కృషి సల్పిన నిపుణులు ఈ గ్రీన్బర్గ్ ప్రైజ్ల కోసం ఎంపిక చేయబడ్డారు. అవార్డు గ్రహీతలను ద అవుట్స్టాడింగ్ ప్రైజ్, ద విజనరీ ప్రైజ్ల పేర్లతో రెండు విభాగాలలో సత్కరిస్తున్నారు. 3 మిలియన్ డాలర్ల నగదును అవార్డులు పొందినవారికి ప్రైజ్ మనీ కింద అందిస్తున్నారు. గ్రీన్బర్గ్ ప్రైజ్ అనేది.. వ్యాపారం, రాజకీయాలు, సంస్కృతి, కళ, సంగీతం, వినోద ప్రపంచాల చెందిన ప్రముఖులు చాలా ప్రతిష్టాత్మకమైనదిగా భావిస్తారు. ఎల్విపిఇఐ ఈ అవార్డును భారతదేశంలోని మరో సంస్థతో పంచుకుంటుంది.
అవార్డు వేడుకను చూడటానికి వివరాలు: గంటసేపు జరిగే అవార్డు ప్రదానోత్సవం ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. www.EndBlindness2020.com లో ఉచితంగా వీక్షించవచ్చు. భారతీయ సమయం ప్రకారం 2020 డిసెంబర్ 15 మంగళవారం ఉదయం 05:30 ప్రసారమవుతుంది.
Also Read :
డ్యాం ఎత్తును ఒక్క మిల్లీమీటరు కూడా తగ్గించడంలేదు..పోలవరం గడ్డ సాక్షిగా తేల్చి చెప్పిన సీఎం జగన్
ఆఫీసులు, స్కూళ్లలో వ్యాక్సిన్ సెంటర్లు..పూర్తి విధానం ఇదే..రాష్ట్రాలకు కేంద్రం గైడ్ లైన్స్
ఆ విషయంలో హర్టయ్యాడు..పెళ్లి అయిన వెంటనే వధువును కల్యాణమండపంలో వదిలేసి వెళ్లిపోయాడు