Bengaluru Earthquake: భారీ వింత శబ్ధాలతో ఉలిక్కి పడ్డ బెంగళూరు.. మరికొన్ని ప్రాంతాల్లోనూ శబ్ధాల కలకలం..
కర్ణాటక రాజధాని బెంగళూరు మరోసారి భారీ వింత శబ్ధాలతో ఉలిక్కిపడింది. శుక్రవారంమధ్యాహ్నం 12 గంటల సమయంలో నగరంలోని పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా భారీ వింత శబ్ధాలు వినిపించాయి
కర్ణాటక రాజధాని బెంగళూరు మరోసారి భారీ వింత శబ్ధాలతో ఉలిక్కిపడింది. శుక్రవారంమధ్యాహ్నం 12 గంటల సమయంలో నగరంలోని పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా భారీ వింత శబ్ధాలు వినిపించాయి. దీంతో నగరవాసులు ఆందోళనకుగురయ్యారు. ‘ భూకంపమేమన్నా వచ్చిందా?’, ‘అసలేం జరుగుతోంది’ అంటూ పలువురు సోషల్ మీడియా పోస్టులతో హోరెత్తించారు. ఒక్క బెంగళూరులోనే కాదు మండ్య, రామనగర జిల్లాల్లోనూ ఈ వింత శబ్ధాలు వినిపించాయి. ఇవి భూకంపం వల్ల సంభవించిన శబ్ధాలా? లేక సూపర్ సోనిక్ బూమ్ సంకేతాలా?అన్న అనుమానాలు వ్యక్తం చేస్తూ అక్కడి ప్రజలు నెట్టింట్లో పోస్టులు పెట్టారు. ‘ఇప్పుడే బెంగళూరులోని రాజరాజేశ్వరి నగరలో భారీ శబ్ధం వినిపించింది. ఇంటి తలుపులు, కిటికీలు ఊగిపోయాయి. నాకొక్కడికేనా లేక ఇంకా ఎవరికైనా ఇలా అనిపించిందా..?’ అని ఓ నెటిజన్ ట్విట్టర్లో పోస్ట్ పెట్టాడు.
గతంలోనూ..
అయితే ఈ శబ్ధాలకు, భూప్రకంపనలకు సంబంధం లేదని ప్రకృతి విపత్తుల విభాగం స్పష్టం చేసింది.’శుక్రవారం మధ్యాహ్నం బెంగళూరుతో పాటు పలు ప్రాంతాల్లో భారీ వింత శబ్ధాలు వినిపించినట్లు రిపోర్ట్స్ వచ్చాయి. వీటిని మేము సెసిమిక్ అబ్జర్వేటరీలతో విశ్లేషించాం.. ఎటువంటి భూకంప సంకేతాలు కనిపించలేదు’ అని కర్ణాటక రాష్ట్ర ప్రకృతి విపత్తు పర్యవేక్షణ కేంద్రం(KSNDMC) వెల్లడించింది. దీంతో కర్ణాటక వాసులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ మిస్టరీ సౌండ్స్కు కారణమేమిటన్నది ఎవరికీ అంతుచిక్కడం లేదు. బెంగళూరులో ఇలాంటి భారీ వింత శబ్ధాలు వినిపించడం ఇదేమి మొదటిసారికాదు. గతేడాది మే నెలలో కూడా ఇలాంటి భారీ శబ్ధాలు వినిపించాయి. అయితే యుద్ధ విమానం టేకాఫ్ కారణంగానే ఈ శబ్ధం వచ్చినట్లు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ స్పష్టం చేసింది. ఇక ఈ ఏడాది జులైలోనూ బెంగళూరు నగరంలోనూ భారీ శబ్ధాలు వినిపించాయి.
Also Read:
Eggs Attack: ఒడిశాలో కొనసాగుతోన్న కోడిగుడ్ల రాజకీయం.. నిన్న సీఎం.. నేడు మహిళా ఎంపీలపై దాడులు..