ఆగస్టు 5 న న్యూయార్క్ లో కనిపించనున్న ‘అయోధ్యా రాముడు’
ఆగస్టు 5 న అయోధ్యలో రామాలయ నిర్మాణానికి ప్రధాని మోదీ భూమిపూజ చేయనున్న నేపథ్యంలో.. దీనినొక చరిత్రాత్మక ఘటనగా మలిచేందుకు నిర్వాహకులు యోచిస్తున్నారు. ఆ రోజున న్యూయార్క్ లోని టైమ్స్ స్క్యేర్ లో..
ఆగస్టు 5 న అయోధ్యలో రామాలయ నిర్మాణానికి ప్రధాని మోదీ భూమిపూజ చేయనున్న నేపథ్యంలో.. దీనినొక చరిత్రాత్మక ఘటనగా మలిచేందుకు నిర్వాహకులు యోచిస్తున్నారు. ఆ రోజున న్యూయార్క్ లోని టైమ్స్ స్క్యేర్ లో ప్రధాన వీధులన్నీ శ్రీరాముడి నిలువెత్తు 3 డీ చిత్రాలతో నిండిపోనున్నాయి. అలాగే అయోధ్యలోని ఆలయ నమూనాను కూడా భారీ పోర్ట్రైట్లతో హైలైట్ చేయనున్నామని . బిల్ బోర్డులన్నీ వీటితో కళకళలాడనున్నాయని అమెరికన్ ఇండియా పబ్లిక్ అఫైర్స్ కమిటీ అధ్యక్షుడు జగదీష్ సెహ్వానీ ప్రకటించారు. ఇందుకు ఏర్పాట్లన్నీ చురుకుగా సాగుతున్నాయన్నారు.
17 వేల చదరపు అడుగుల ఎత్తయిన ఎల్ ఈ డీ డిస్ ప్లే స్క్రీన్ తో బాటు ఇక్కడి ఇతర స్క్రీన్లను కూడా ఇందుకు వినియోగిస్తామని, ఆ రోజు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటలవరకు ‘జై శ్రీరామ్’ అనే పదాలు హిందీ, ఇంగ్లీషు భాషల్లో ఈ స్క్రీన్లలో కనిపించేలా చూస్తామని ఆయన చెప్పారు. ప్రధాని మోదీ భూమి పూజ చేస్తున్న ఫోటోలు, ఇమేజీలను దాదాపు నగరమంతా ప్రదర్శించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయని జగదీష్ సెహ్వానీ పేర్కొన్నారు.’ మోదీ హయాంలో రామాలయ నిర్మాణం జరగడం ఓ అద్భుత ఘట్టం.. ఇన్నాళ్లకు ప్రజల కల తీరబోతోంది.. ఆరేళ్ళ క్రితం కూడా ఇలాంటి రోజు వస్తుందని మేం ఊహించలేదు’ అని ఆయన వ్యాఖ్యానించారు.